News March 16, 2025

మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌పై కేసు నమోదు

image

కదిరిలో అమృతవల్లి డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ వెంకటపతిపై శనివారం కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. హోలీ పండుగను అడ్డుపెట్టుకొని డిగ్రీ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారించిన కానిస్టేబుల్ గౌసియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 75 బీఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Similar News

News November 1, 2025

ఎంత ఇబ్బంది పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటా: జోగి రమేశ్

image

సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌లను ప్రశ్నించినందుకు తనపై దుష్ప్రచారం చేశారని మాజీ మంత్రి జోగి రమేశ్ ధ్వజమెత్తారు. కూటమి సర్కార్ తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీని బయటపెట్టానని తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదని దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేశానన్నారు. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చట్టాన్ని, వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు.

News November 1, 2025

ఉప్పు వేయడం, వేర్లు నరకడం వల్ల కొబ్బరి దిగుబడి పెరుగుతుందా?

image

చాలా చోట్ల కొబ్బరి సాగు చేస్తున్న రైతులు చెట్లకు ఉప్పు వేయడం, వేర్లు నరకడం చేస్తుంటారు. దీని వల్ల దిగుబడి పెరుగుతుందని కొందరు చెబుతుంటారు. ఏడాది వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఏడాది దిగుబడి కొంత పెరగడం కనిపిస్తుంది. కానీ తర్వాత ఏడాది నుంచి దిగుబడి తగ్గిపోతుంది. అది చెట్టుకు కూడా హాని చేస్తుంది. ఇది అశాస్త్రీయమైన పద్ధతి అని, దీన్ని పాటించకపోవడం మంచిదని ఉద్యాన పరిశోధనా నిపుణులు చెబుతున్నారు.

News November 1, 2025

బస్సు దగ్ధంపై తప్పుడు ప్రచారం: 27 మందిపై కేసు

image

కర్నూలు శివారులో జరిగిన బస్సు దగ్ధం ఘటనపై తప్పుడు సమాచారం వైరల్ చేసిన 27 మందిపై కర్నూలు తాలూకా పోలీసులు కేసులు నమోదు చేశారు. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర SM వేదికల్లో వాస్తవాలకు విరుద్ధంగా పోస్టులు చేస్తూ, తప్పుడు కోటేషన్లు పెట్టిన వారిని పోలీసులు గుర్తించారు. ప్రజల్లో భయం, గందరగోళం సృష్టించేలా ప్రచారం జరిపినందుకు గానూ ఆ యూజర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.