News March 5, 2025

మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల‌ను విజ‌య‌వంతం చేద్దాం: కలెక్టర్

image

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌హిళా భ‌ద్ర‌త‌, సాధికార‌త‌కు అత్యంత ప్రాధాన్య‌మిస్తున్నాయ‌ని వారిని స‌మ‌గ్రాభివృద్ధి దిశ‌గా న‌డిపించేలా అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల‌ను విజ‌య‌వంతం చేద్దామ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. ఈ నెల 8న అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవ సందర్బంగా బుధ‌వారం అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

Similar News

News November 3, 2025

గాంధారిలో 51మి.మీ. అత్యధిక వర్షపాతం

image

కామారెడ్డి జిల్లాలో కురిసిన అకాల వర్షం కారణంగా గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. గాంధారి 51 మి.మీ., బొమ్మన్ దేవిపల్లిలో 33, కొల్లూరు 28.5, బీబీపేట్ 21.5, నస్రుల్లాబాద్ 20.3, సదాశివనగర్ 16, సర్వాపూర్ 13.8, IDOC(కామారెడ్డి) 13, బీర్కూర్ 9.2, మక్దూంపూర్ 7, రామలక్ష్మణ పల్లి 5.8, ఆర్గొండ 5.2, మాచాపూర్ 4, హసన్పల్లి 3.8మి.మీ. నమోదయ్యింది.

News November 3, 2025

ఎటు చూసినా మృతదేహాలే..

image

TG: చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి <<18183773>>బస్సు<<>> ప్రమాద మృతుల బంధువుల ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది. ఎటు చూసినా మృతదేహాలే కనిపిస్తుండడంతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. ఆసుపత్రిలో సరిపడా బెడ్లు లేకపోవడంతో క్షతగ్రాతులను బెంచ్‌లపై పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారని సమాచారం.

News November 3, 2025

ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్.. తగ్గిన పత్తి ధర

image

నాలుగు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌‌కు పత్తి స్వల్పంగానే తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. నేడు క్వింటా పత్తి ధర రూ.6,920 పలికినట్లు పేర్కొన్నారు. గత వారం రూ.7 వేలకు పైగా పలికిన పత్తి ధర.. నేడు పడిపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి.