News March 6, 2025
మహిళా శక్తి పథకం గ్రౌండింగ్ పనులను పూర్తి చేయండి

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలోని 16 రకాల యూనిట్ల గ్రౌండింగ్ వంద శాతం పూర్తి చేసి లక్ష్యాలను సాధించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారులతో మహిళా శక్తి పథకం యూనిట్ల లక్ష్యం, బ్యాంక్ లింకేజీ రుణాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. మహిళలని ఆర్థికంగా బలోపేతం చేయడమే దీని ఉద్దేశమన్నారు.
Similar News
News February 8, 2026
పిట్లం: కూలి డబ్బుల కోసం హత్య

పిట్లంలో ఈ నెల <<19069742>>6న జరిగిన హత్య<<>> కేసును పోలీసులు ఛేదించారు. బాన్సువాడ DSP విఠల్ రెడ్డి వివరాలు వెల్లడించారు. UPకి చెందిన రాజేశ్, శ్రీకృష్ణ పెయింటింగ్ పనుల కోసం పిట్లం వచ్చారు. కూలీ డబ్బుల విషయంలో వారిద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో రాజేశ్ను శ్రీకృష్ణ కర్రతో కొట్టి హత్య చేసి పరారయ్యాడు. నిందితుడు ఊరు విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
News February 8, 2026
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News February 8, 2026
విద్యార్థులకు అస్వస్థత.. కారకులపై CM సీరియస్

AP: పోలవరం(D) దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడానికి గల కారకులపై CM CBN ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటిలోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. బాధ్యులపై శాఖాపరమైన, అవసరాన్ని బట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. కాగా నిన్న టిఫిన్ చేశాక 92మంది విద్యార్థులకు కడుపునొప్పి, జ్వరం రావడంతో ఆస్పత్రులకు తరలించామని అధికారులు వివరించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కుదుటపడిందన్నారు.


