News July 12, 2024
మహిళా శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
ఖమ్మం: మహిళలను ఆర్థికంగా శక్తివంతులను చేయడమే మహిళా శక్తి పథకం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మహిళా శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళల సామాజిక భద్రత కోణంలో సంఘాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
Similar News
News October 15, 2024
కమనీయం.. భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్య కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
News October 15, 2024
నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వర్ష సూచన
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకూ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 18 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. SHARE IT
News October 15, 2024
ఖమ్మం: ఓ పెయింటర్ ఆవేదన..!
ప్రస్తుతం కూరగాయలు, నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో రోజువారీ కూలీలు, పెయింటింగ్ పనులు చేసేవారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో పెయింటర్ చిర్ర సురేశ్ మాట్లాడుతూ.. 2 నెలల నుంచి నిత్యావసర సరకుల ధరలు మండిపోతున్నాయని, వంట నూనె, వెల్లుల్లి, టమాట ఇలా అన్నింటి రేట్లు పెరిగిపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని స్థితి తమదని, రేట్లు తగ్గించాలని కోరారు.