News March 18, 2025

మహిళ డెడ్‌బాడీ.. అనకాపల్లి ఎస్పీకి హోం మంత్రి ఫోన్

image

కసింకోట మండలం బయ్యవరం గ్రామం వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంగళవారం మంత్రి అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హాతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే విచారణ నిర్వహించి నిందితులను అరెస్టు చేయాలని ఆమె ఆదేశించారు.

Similar News

News March 20, 2025

గజ్వేల్ MLA క్యాంప్ ఆఫీసుకు TOLET బోర్డు పెట్టిన బీజేపీ

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బీజేపీ నాయకులు టూలెట్ బోర్డు పెట్టారు. గజ్వేల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయం ఎదుట ఆకస్మికంగా ధర్నా చేపట్టిన బీజేపీ నాయకులు కేసీఆర్ గజ్వేల్ రావాలని, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు.

News March 20, 2025

సంగారెడ్డి: చెరువులో తల్లి, కూతుర్ల మృతదేహాలు లభ్యం

image

చెరువులో తల్లి, కూతుర్ల మృతదేహాలు లభ్యమైన ఘటన సంగారెడ్డిలో జరిగింది. పట్టణ సీఐ రమేశ్ వివరాలు ప్రకారం.. మెదక్ పట్టణానికి చెందిన విజయలక్ష్మి (54), కుమార్తె మణిదీపిక(25) అదృశ్యమైనట్లు ఈనెల 17న మెదక్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని వినాయక సాగర్ చెరువులో తల్లి, కూతుర్లు మృత దేహాలు లభ్యమయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 20, 2025

HYD: ఒక్కో IPL మ్యాచ్.. రూ.1.5 కోట్లు..!

image

ఉప్పల్ స్టేడియం వెన్యూను SRH వాళ్లు రెంట్‌కు తీసుకుంటారని ప్రతి IPL మ్యాచ్ కోసం రూ.1.5 కోట్లు తమకు చెల్లిస్తారని HCA ప్రెసిడెంట్ అన్నారు. IPL మ్యాచులలో HCA పాత్ర పరిమితంగా ఉంటుందని, మిగతా వాటిల్లో HYD ఉప్పల్ స్టేడియం మొత్తం HCA కంట్రోల్లో ఉంటుందని ప్రెసిడెంట్ జగన్ మోహన్‌రావు తెలిపారు. దీంతో హౌస్ కీపింగ్, క్లీనింగ్ లాంటి సదుపాయాలు కల్పిస్తామే తప్ప, టికెట్ల ధరలు తమ కంట్రోల్లో ఉండవన్నారు.

error: Content is protected !!