News March 19, 2025

మహిళ హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

image

మహిళ హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించిందని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి చెప్పారు. 2013 మార్చి నెలలో రాణి అనే మహిళను రాజశేఖర్ అనే వ్యక్తి బాపట్ల మండలం అడవి పంచాయతీలోని శిథిలావస్థలో ఉన్న భవనంలో కత్తితో దాడి చేసి హత్య చేశాడన్నారు. బుధవారం న్యాయస్థానం నిందితుడికి శిక్షను ఖరారు చేసిందన్నారు. శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించినట్లు తెలిపారు.

Similar News

News September 13, 2025

రేపే INDvsPAK.. మ్యాచ్ చూస్తారా?

image

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉంటే క్రేజే వేరు. కొందరైతే ఎంత ఖర్చయినా సరే విదేశాలకు వెళ్లి మ్యాచ్‌లు చూస్తుంటారు. కానీ పహల్గామ్ అటాక్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దాయాదుల పోరుపై చాలామంది ఇంట్రెస్టే చూపట్లేదు. కొందరేమో మ్యాచ్‌ను మ్యాచ్‌లా చూడాలంటున్నారు. SMలో ఇంత రచ్చ అవుతున్నా BCCI & ప్లేయర్లు స్పందించలేదు. ఇంతకీ రేపు జరిగే మ్యాచ్‌ను మీరు వీక్షిస్తారా? బహిష్కరిస్తారా? కామెంట్ చేయండి.

News September 13, 2025

నరసరావుపేట: తొలి సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్

image

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కృతిక శుక్లా శనివారం కలెక్టరేట్లో జేసీ సూరజ్, జిల్లా అధికారులతో తొలి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతా కార్యక్రమాల అమలు గురించి చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చర్చించాల్సిన పలు అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

News September 13, 2025

కడప: RIMS పూర్వ వైద్యాధికారులపై విచారణకు ఆదేశాలు

image

కడప RIMSలో గతంలో పనిచేసిన వైద్యాధికారులపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్లు సురేశ్వర రెడ్డి, జొన్న నగేశ్, షేక్ మహబూబ్ బాషా, సంజీవయ్య, సత్యనారాయణపై విచారణకు అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరావు, కడప ఏసీబీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసుల రెడ్డిలను విచారణాధికారులుగా నియామకం చేశారు.