News March 6, 2025

మహ్మదాపూర్‌లో చోరీపై ఎస్పీ ఆరా

image

పాన్గల్ మండలం మహ్మదాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు ఇంట్లో రెండు రోజుల క్రితం చోరీ జరగ్గా రూ.1.25లక్షలు, 20 తులాల వెండి గొలుసులు దొంగలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆంజనేయులు ఇంటిని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సందర్శించి ఘటనపై ఆరా తీశారు. ఎస్సైతోపాటు సీఐ, ఎస్సై శ్రీనివాసులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News February 9, 2026

సైలెంట్ కిల్లర్: భారత్‌లో నలుగురిలో ఒకరికి ‘ఫ్యాటీ లివర్’!

image

ఇండియా ప్రస్తుతం ఒక సైలెంట్ హెల్త్ క్రైసిస్‌ని ఎదుర్కొంటోంది. డ్రింకింగ్ అలవాటు లేకపోయినా కేవలం ఒబెసిటీ, డయాబెటిస్ వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ (MASLD) కేసులు దేశంలో విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ‘ది లాన్సెట్’లో పబ్లిష్ అయిన అధ్యయనం ప్రకారం మన దేశంలో ప్రతి నలుగురు అడల్ట్స్‌లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. వీరిలో చాలా మందికి కాలేయం గట్టిపడటం (Fibrosis) వంటి ప్రమాదకర లక్షణాలు ఇప్పటికే మొదలయ్యాయి.

News February 9, 2026

T20WC: చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్

image

T20WC-2026లో సరికొత్త రికార్డు నమోదైంది. ఇటలీతో మ్యాచ్‌లో స్కాట్లాండ్ 207/4 స్కోర్ చేసింది. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో 200+ రన్స్ చేసిన తొలి అసోసియేట్ టీమ్‌(టెస్టు హోదా లేని జట్టు)గా చరిత్ర సృష్టించింది. గతంలో USA 197/3(vsCAN), CAN 194/5(vsUSA), NED 193/4(vsIRE) స్కోర్ చేశాయి. ఇక ఈ మ్యాచ్‌లో జార్జ్ మున్సే 84(54 B), బ్రెండన్ మెక్‌ముల్లెన్ 41(18 B), మైఖేల్ లీస్క్ 22(5 B) అదరగొట్టారు.

News February 9, 2026

CM సమీక్షకు నెల్లూరు కలెక్టర్ హాజరు

image

అమరావతి సచివాలయం నుంచి మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. నెల్లూరు కలెక్టరేట్ నుంచి వర్చువల్‌గా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డా.అజితా వెజండ్ల, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. GDP వృద్ధిరేటు, RTGS, ప్రాజెక్టుల పురోగతి.. సంక్షేమ కార్యక్రమాల అమలు, స్వర్ణాంధ్ర విజన్‌ 2047, లా అండ్‌ ఆర్డర్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.