News January 28, 2025

మాఘ అమావాస్య కోసం ఏడుపాయల ముస్తాబు

image

మాఘ అమావాస్య సందర్భంగా ప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గా మాత ముస్తాబయ్యింది. మంజీరా నది పాయల్లో సుమారు లక్ష మంది పుణ్య స్నానాలు ఆచరించేందుకు రానున్నారు. ఈనెల 29న మాఘ అమావాస్య సందర్భంగా మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రం బీదర్, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు తరలివస్తారు. రాజ గోపురం నుంచి ఆలయం వరకు భక్తుల కోసం క్యూలైన్ ఏర్పాటు చేశారు.

Similar News

News October 14, 2025

MDK: అమరవీరులను స్మరించుకుంటూ వ్యాసరచన పోటీలు: ఎస్పీ

image

మెదక్ జిల్లాలోని పోలీస్ ఫ్లాగ్ డే (అక్టోబర్ 21) సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రకటించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకునే ఉద్దేశంతో ఈ ఆన్‌లైన్ పోటీలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మూడు భాషల్లో నిర్వహిస్తారు. 6వ తరగతి నుంచి ఆసక్తి ఉన్న విద్యార్థులు పాల్గొనాలని ఎస్పీ సూచించారు.

News October 14, 2025

MDK: మహిళపై లైంగిక దాడి, హత్య.. జీవిత ఖైదు

image

మెదక్ పట్టణంలో 2020లో జరిగిన మహిళపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడికి జిల్లా న్యాయమూర్తి నీలిమ సంచలన తీర్పు ఇచ్చారు. నిందితుడైన ఫకీరానాయక్‌కు జీవిత ఖైదు, రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. కల్లు దుకాణం వద్ద పరిచయం పెంచుకుని, పొలానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

News October 13, 2025

మెదక్: బాణాసంచ విక్రయాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి: ఎస్పీ

image

దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక టపాకాయల (బాణాసంచా) దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు ముందస్తుగా అనుమతి పొందడం తప్పనిసరి అని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. వ్యాపారులు తమ దరఖాస్తులను సంబంధిత సబ్ డివిజన్ పోలీస్ అధికారి కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు. మార్గదర్శకాల కోసం కూడా సబ్ డివిజన్ పోలీస్ అధికారిని సంప్రదించాలని ఎస్పీ పేర్కొన్నారు.