News August 6, 2024
మాచర్ల: ‘నేను ఏ తప్పు చేయలేదు’ అంటూ.. సూసైడ్

మాచర్లలో సోమవారం విద్యార్థిని <<13779862>>ఆత్మహత్య చేసుకున్న<<>> విషయం తెలిసిందే. తోటి విద్యార్థి రేణుకకు ఫోన్ చేస్తే పనిలో ఉండి స్పందిలేదు. దీంతో అతడు యువతి తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. రేణుకకు ఫోన్ చేసిన తండ్రి ‘అబ్బాయిలతో ఏం పని అని కోపడ్డాడు. భయపడిన యువతి తాను అన్నలా భావించిన తోటి విద్యార్థితో ఉన్న సంబంధాన్ని తండ్రి తప్పుగా అర్థం చేసుకున్నాడు. తాను ఏ తప్పు చేయలేదంటూ లెటర్ రాసి హాస్టల్లో సూసైడ్ చేసుకుంది.
Similar News
News November 21, 2025
Way2Newsలో వార్త.. నేడు మంత్రి పర్యటన

రాజధాని గ్రామాల్లో గత ప్రభుత్వంలో నిర్మించిన వెల్నెస్ సెంటర్లు నిరుపయోగంగా ఉన్నాయంటూ ఈ నెల 18వ తేదీన Way2Newsలో వార్త పబ్లిష్ అయ్యింది. స్పందించిన మంత్రి నారాయణ శుక్రవారం ఉదయం 8 గంటలకు రాజధాని గ్రామాల్లో CITIIS ప్రాజెక్ట్ కింద చేపట్టిన అంగన్వాడీ సెంటర్లు, స్కూల్స్, హెల్త్ సెంటర్లను పరిశీలించనున్నట్లు మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరి కాసేపట్లో మంత్రి పర్యటన అప్డేట్ Way2Newsలో చూడొచ్చు.
News November 21, 2025
గుంటూరులోని ఈ బాలుడు మీకు తెలుసా?

గుంటూరు రైల్వేస్టేషన్ తూర్పు గేటు పార్కింగ్ వద్ద నవంబర్ 18న ఉదయం 8 గంటలకు మూడేళ్ల బాలుడు ఏడుస్తూ ఒంటరిగా దొరికాడు. తల్లిదండ్రుల ఆచూకీ లభించకపోవడంతో ఆర్పీఎఫ్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు బాలుడిని కొత్తపేట పోలీసుల ద్వారా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. బాలుడు తన వివరాలు చెప్పలేకపోతున్నాడు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు తనను 8688831320 నంబర్లో సంప్రదించాలని కొత్తపేట సీఐ కోరారు.
News November 21, 2025
గుంటూరు: డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

గుంటూరు జిల్లా వ్యాప్తంగా DEC 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. సివిల్, రాజీ పడదగ్గ క్రిమినల్, ఎక్సైజ్, మోటార్ ప్రమాద బీమా, చెక్ బౌన్స్, LAOP, ప్రీ-లిటిగేషన్ కేసులపై ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. కక్షిదారులు, పోలీసులు, స్టేక్హోల్డర్లు ఎక్కువ కేసులు రాజీ చేసుకునేందుకు సహకరించాలన్నారు.


