News May 27, 2024

మాచర్ల: ‘రెచ్చిపోతున్న వైసీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలి’

image

పట్టణంలో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్న పోలీసులు చర్యలు తీసుకోకపోవటం బాధాకరమని టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. టీడీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పాశవికంగా కత్తులతో స్వైర్య విహారం చేయడం పట్ల వారు ఆవేదన వెలిబుచ్చారు. తురక కిషోర్ ప్రధాన అనుచరుడిగా ఉన్న వెంకటేశ్ సుమారు 10కేసుల్లో నిందితుడిగా ఉన్నప్పటికీ పోలీసులు అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. 

Similar News

News April 19, 2026

గుంటూరులో నేడు బంగారం ధర ఎంతంటే?

image

అక్షయ తృతీయ కావడంతో గుంటూరు జిల్లాలో బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. గుంటూరులో ఆదివారం 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ రూ. 1,57,934 పలుకుతోంది. 22 క్యారెట్ 10 గ్రాములు రూ. 1,43,600 చొప్పున విక్రయిస్తున్నారు. వెండి గ్రాము రూ. 263గా ఉంది. అక్షయ తృతీయలో కనీసం గ్రాము బంగారమైనా కొనాలని పలువురు ఆసక్తి చూపుతున్నారు.

News April 19, 2026

GNT: వై.ఎస్ విజయమ్మకు లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు

image

వై.ఎస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ‘x’ వేదికగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రీమతి వై.ఎస్. విజయమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో ఆమె మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాము’. అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

News April 19, 2026

మ్యుటేషన్ కొత్త రూల్స్‌తో గుంటూరు రైతుల అవస్థలు

image

ఆటో మ్యుటేషన్ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. భూమి రిజిస్ట్రేషన్ అయ్యాక అమ్మిన, కొన్న వ్యక్తులిద్దరూ అధికారుల వద్ద బయోమెట్రిక్ వేస్తేనే మ్యుటేషన్ పూర్తవుతుంది. ఒకవేళ అమ్మిన వారు అందుబాటులో లేకున్నా, చనిపోయినా ఏం చేయాలనే దానిపై స్పష్టత లేదు. పారదర్శకత కోసమే ఈ రూల్ తెచ్చినా.. దీనివల్ల గుంటూరు జిల్లా రైతులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.