News April 9, 2025

మాచర్ల: సాగర్‌లో సీఆర్పీఎఫ్ బలగాల ఉపసంహరణ

image

నాగార్జునసాగర్ డ్యాం రక్షణకు ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలను కేంద్రం మంగళవారం ఉపసంహరించుకుంది. గతంలో నాగార్జునసాగర్ డ్యాం రక్షణ తెలంగాణకు చెందిన ఎస్పీఎఫ్ ఆధీనంలో ఉండేది. తరచూ నీటి విడుదల విషయంలో ఆంధ్ర, తెలంగాణ అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉండటంతో కేంద్రం జోక్యం చేసుకొని డ్యాం భద్రతను సీఆర్పిఎఫ్‌కు అప్పగించింది. బలగాలను వెనక్కి వచ్చేయాలని ఆదేశించడంతో డ్యామ్ భద్రత తెలంగాణ ఎస్పీఎఫ్ ఆధీనంలోకి వెళ్లనుంది.

Similar News

News November 21, 2025

బిజినెస్ కార్నర్

image

* హోండా కార్స్ ఇండియా కొత్త SUV ఎలివేట్ ఏడీవీని లాంచ్ చేసింది. HYDలో ఎక్స్ షోరూమ్ ధర ₹15.20 లక్షల నుంచి ₹16.66 లక్షల వరకు ఉంటుంది.
* HYDకి చెందిన బయోలాజికల్-ఇ తయారుచేసిన న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ న్యూబెవాక్స్ 14కి WHO గుర్తింపు లభించింది. ఇది 14 రకాల న్యుమోనియా, మెదడువాపు, సెప్సిస్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
* అంతర్జాతీయ సంస్థలు సొనొకో, EBG గ్రూప్ HYDలో కార్యాలయాలు నెలకొల్పాయి.

News November 21, 2025

HYD: GOVT ఉద్యోగులపై దాడి చేస్తే క్రిమినల్ కేసులు

image

ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకాలు కలిగించినా, వారిపై దాడులకు దిగినా కఠినచర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు. పోలీసులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించినా, దాడులు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధినిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.

News November 21, 2025

గజపతినగరం: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

image

గజపతినగరం మండలం ఎం.గుమడాం గ్రామానికి చెందిన గంట్యాడ అప్పలనాయుడు మానసిక స్థితి బాగోలేనందున ఈనెల 19న పురుగులు మందు తాగినట్లు భార్య సత్యవతి తెలిపారు. అతడిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడుకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.