News February 11, 2025
మాచవరం: ఎడ్ల పోటీల్లో బహుమతిగా బుల్లెట్

మాచవరం మండలం మొర్జంపాడు గ్రామంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీల్లో మంగళవారం సీనియర్ విభాగం ఎడ్ల జతకు పోటీలు ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి ప్రైజ్ రూ. 2 లక్షలు విలువ చేసే బుల్లెట్ బండిని బహుమతిగా అందజేయనున్నారు. రెండో బహుమతిగా హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ను కూడా అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.
Similar News
News December 7, 2025
కృష్ణా: వసతి గృహాల పర్యవేక్షణకు యాప్

వసతి గృహాల నిర్వహణలో పారదర్శకత, నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో HPTS అనే ప్రత్యేక యాప్ను అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా అధికారులు వసతి గృహాల్లోని సేవలను నిరంతరం పర్యవేక్షించవచ్చు. రోజువారీ, వారాంతపు నిర్వహణ పనులను తప్పనిసరిగా ఈ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
News December 7, 2025
ANU పరీక్షల్లో డిజిటల్ విధానం.. ప్రశ్నపత్రాల లీకేజీకి చెక్

ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలను అరికట్టేందుకు ఆచార్య నాగార్జున వర్సిటీ (ANU) డిజిటల్ విధానాన్ని ప్రారంభించింది. ఇకపై పరీక్షా కేంద్రాలకు పాస్వర్డ్ ఉన్న సీడీల్లోనే ప్రశ్నపత్రాలు పంపనున్నారు. ఇప్పటికే బీఈడీ, లా కోర్సుల్లో ఈ పద్ధతి అమలవుతోంది. మోడరేషన్ కోసం గుంటూరు, నరసరావుపేట, తెనాలి ప్రాంతాల్లో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేశారు.
News December 7, 2025
వరంగల్: సర్పంచ్కు పోటీ.. 9 మందిది ఒకే ఇంటి పేరు!

జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో సర్పంచ్ స్థానానికి 12 మంది బరిలో ఉన్నారు. వీరిలో 9 మంది ఒకే ఇంటి పేరు గల అభ్యర్థులు ఉండడం ఓటర్లకు తలనొప్పిగా మారింది. సీనపెల్లి అనే ఇంటి పేరుతో ఉన్న అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తుండగా, ఇందులో సీనపెల్లి రాజు అనే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దీంతో ఎన్నికల పోలింగ్ సమయంలో ఎవరికి ఓట్లు పడతాయో అర్థం కానీ పరిస్థితి.


