News February 11, 2025
మాచవరం: ఎడ్ల పోటీల్లో బహుమతిగా బుల్లెట్

మాచవరం మండలం మొర్జంపాడు గ్రామంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీల్లో మంగళవారం సీనియర్ విభాగం ఎడ్ల జతకు పోటీలు ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి ప్రైజ్ రూ. 2 లక్షలు విలువ చేసే బుల్లెట్ బండిని బహుమతిగా అందజేయనున్నారు. రెండో బహుమతిగా హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ను కూడా అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.
Similar News
News November 10, 2025
ఆ ఇద్దరిలో ఒకరికి RR పగ్గాలు?

వచ్చే IPL సీజన్లో రాజస్థాన్ రాయల్స్ సారథి <<18248474>>సంజు శాంసన్<<>> జట్టును వీడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త కెప్టెన్ ఎవరనే ప్రశ్న బాగా వినిపిస్తోంది. దీనికి సమాధానంగా ధ్రువ్ జురెల్, జైస్వాల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. RR కెప్టెన్సీ రేసులో వీళ్లే ముందున్నారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రియాన్ పరాగ్ పేరు ఈ లిస్ట్లో లేకపోవడం గమనార్హం. ఎవరు RR కెప్టెనైతే బాగుంటుంది? COMMENT
News November 10, 2025
సిద్దిపేట: పరీక్ష ఫీజు చెల్లించిన కేంద్ర మంత్రి

మోదీ గిఫ్ట్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఎగ్జామ్ ఫీజును చెల్లిస్తానని ప్రకటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ సోమవారం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట జిల్లా టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు రూ.1,41,025 మొత్తాన్ని చెల్లించారు. పరీక్ష ఫీజు చెక్కును కలెక్టర్ హైమావతికి బీజేపీ నాయకులు అందజేశారు.
News November 10, 2025
సిద్దిపేట మెడికల్ కాలేజీకి మరో 8 సీట్లు మంజూరు

సిద్దిపేట మెడికల్ కాలేజీలో పీజీ సీట్లు 83కు చేరాయి. కొత్తగా రేడియాలజీ, ఆర్థోపెడిక్ విభాగాల్లో 8 పీజీ సీట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. అనతి కాలంలోనే సిద్దిపేట మెడికల్ కళాశాలలో 18 స్పెషాలిటీల్లో పీజీ కోర్సులు అందిస్తుందన్నారు. ఉస్మానియా, గాంధీ, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీల స్థాయిలో సిద్దిపేట వైద్య కాలేజి నడుస్తుందన్నారు.


