News April 2, 2025
మాచారెడ్డి: నలుగురు పేకాటరాయుళ్లపై కేసు

మాచారెడ్డి మండలం వాడి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.22,260 నగదు, 4 మొబైల్స్, 2 బైక్స్ సీజ్ చేసి కేసు నమోదు చేసినట్ల వివరించారు. ఎవరైనా పేకాట ఆడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా పేకాట ఆడితే 100కు డయల్ చేసి చెప్పాలన్నారు.
Similar News
News October 21, 2025
NZB: అమరుడా నీకు వందనం

పోలీసులు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో 5 రోజుల క్రితం NZBలో విధి నిర్వహణలో అమరుడైన CCS కానిస్టేబుల్ ప్రమోద్కు పోలీసులతో పాటు జిల్లా ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. నగరంలోని గూపన్పల్లికి చెందిన ప్రమోద్ 2003 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 3 నెలల క్రితం ట్రాఫిక్ విభాగంలో పని చేసిన ఆయన ఇటీవలే CCSకు బదలీ అయ్యారు. ఆయన సోదరుడు కూడా కానిస్టేబులే. జోహార్ ప్రమోద్.
News October 21, 2025
అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అనంతరం 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఇవాళ APలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఈ నెల 23 ఉదయం 8.30 గంటల వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News October 21, 2025
NRPT: శ్రీశైలం, యాదగిరి గుట్టకు ప్రత్యేక బస్ సర్వీసులు

కార్తికమాసం పురస్కరించుకొని నేటి నుంచి నారాయణపేట ఆర్టీసీ బస్ డిపో నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి డీలక్స్ ప్రత్యేక బస్ సర్వీసు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ లావణ్య సోమవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 5:10 నిమిషాలకు బయలుదేరి 11:45 నిమిషాలకు శ్రీశైలం చేరుకుంటుందని, మళ్లీ అదే రోజు మధ్యాహ్నం 2:15 బయలుదేరి సాయంత్రం 6:45 NRPT చేరుకుంటుందన్నారు. యాదగిరి గుట్టకు ఉదయం 8:40 నిమిషాలకు బయలుదేరుతున్నారు.