News April 4, 2024
మాజీ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీకాలం ముగిసింది. 2018 ఏప్రిల్ 3న ఆయన వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎంపీగా అనేక అంశాలు, సమస్యలపై రాజ్యసభలో గళం వినిపించారు. ప్యానల్ వైస్ ఛైర్మన్గా సభను కూడా నడిపించారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా లోక్ సభ బరిలోకి దిగబోతున్నారు.
Similar News
News November 19, 2025
నెల్లూరులో చిక్కనంటున్న.. ఆకుకూరలు

మార్కెట్లో ఆకుకూరల ధరలు ఆకాశానంటుతున్నాయి. రూ. 20కి తోటకూర 3, చిర్రాకు 3, గోంగూర 3 కట్టలు ఇస్తున్నారు. గతంలో ఈ ధరకు రెట్టింపు ఇచ్చేవారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు తోటలు దెబ్బతిని ఉత్పత్తి తగ్గింది. ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకువడంతో ధరలు అమాంతం పెరిగాయి. వీటితోపాటు కూరగాయల ధరలు సైతం మండుతున్నాయి. దీంతో సామాన్యుడు జేబుకు చిల్లుపడుతోంది.
News November 19, 2025
ఉదయగిరి: బాలికపై యువకుడు లైంగిక దాడి

బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మంగళవారం దుత్తలూరు మండలంలో చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలికకు కొద్ది నెలల క్రితం వింజమూరుకు చెందిన సాథిక్ అనే యువకుడికి పరిచయమయ్యాడు. ఈక్రమంలో బాలికను ఉదయగిరి దుర్గంపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడగా అస్వస్థతకు గురైంది. బాలికను హాస్పిటల్కి తీసుకెళ్లగా అత్యాచారానికి గురైందని డాక్టర్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు కేసు నమోదు చేశారు.
News November 19, 2025
కావలి: ప్రేమపేరుతో మోసం.. యువతి ఆత్మహత్యాయత్నం

ప్రేమపేరుతో యువకుడు మోసం చేయడంతో యువతి ఆత్మహత్యాయత్ననికి పాల్పడిన ఘటన కావలిలో చోటుచేసుకుంది. విష్ణాలయం వీధికి చెందిన యువకుడు ఓ యువతిని ఐదు నెలలుగా ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకోమంటే కులం పేరుతో దూషించి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి చెందిన యువతి ఫినాయిల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


