News November 21, 2024

మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డికి మాజీ సీఎం జగన్ పరామర్శ

image

గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డిని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో సర్వైకల్ ఆపరేషన్ చేయించుకున్న వైవీఆర్‌ను అర్ధరాత్రి వీడియో కాల్ ద్వారా యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షించారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని, 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని వైవీఆర్ వివరించారు.

Similar News

News February 26, 2026

అనంత: ఇంటర్ సెకండియర్ పరీక్షలు.. 368 మంది గైర్హాజరు

image

అనంతపురం జిల్లాలో 64 పరీక్ష కేంద్రాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సజావుగా జరిగినట్లు ఆర్ఐవో వెంకటరమణ నాయక తెలిపారు. గురువారం ఉదయం జరిగిన ఇంటర్ పరీక్షలకు జనరల్ విద్యార్థులు 20,855 గాను 20,517 మంది హాజరవ్వగా.. 338 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 1,931కి గాను 1,901 మంది హాజరై 30 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

News February 26, 2026

అనంత: ఇంటర్ సెకండియర్ పరీక్షలు.. 368 మంది గైర్హాజరు

image

అనంతపురం జిల్లాలో 64 పరీక్ష కేంద్రాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సజావుగా జరిగినట్లు ఆర్ఐవో వెంకటరమణ నాయక తెలిపారు. గురువారం ఉదయం జరిగిన ఇంటర్ పరీక్షలకు జనరల్ విద్యార్థులు 20,855 గాను 20,517 మంది హాజరవ్వగా.. 338 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 1,931కి గాను 1,901 మంది హాజరై 30 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

News February 26, 2026

31,972 మంది విద్యార్థులు.. 143 పరీక్ష కేంద్రాలు

image

అనంతపురం జిల్లాలో మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 143 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. దాదాపు 31,972 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.