News October 6, 2024
మాజీ మంత్రి అప్పలరాజుని కలిసిన ధర్మాన
వైసీపీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడిగా నియమితులైన మాజీ మంత్రి డా.సీదిరి అప్పలరాజుని ఆదివారం వైసీపీ యువ నాయకులు డా.ధర్మాన కృష్ణ చైతన్య గౌరవ పూర్వకంగా కలిశారు. అనంతరం శాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. అతనితో పాటు ఎంపీపీ మురళీధర్, గోపి, జడ్పీటీసీ రామారావు, సుడా మాజీ ఛైర్మన్ గుప్త, కన్వీనర్లు జగన్, నరసింగరావు పాల్గొన్నారు.
Similar News
News October 6, 2024
SKLM: పారదర్శకంగా ఇసుక సరఫరా: కలెక్టర్
ఇసుక పంపిణీ విధానం జిల్లాలో చట్టబద్ధంగా, సజావుగా, సులభతరంగా సాగేలా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఎస్పీ మహేశ్వర రెడ్డి పలువురు అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక కొరత లేదని, ప్రస్తుతానికి 6000 మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో ఉందని, ఇసుక బుక్ చేసుకున్న 24 గంటల్లోనే సరఫరా చేస్తున్నామని వివరించారు.
News October 6, 2024
శ్రీకాకుళం: అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ
శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపినా, అక్రమంగా ఇసుకను రవాణా చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. వీరికి భారీగా జరిమానా విధించడంతోపాటు, కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. ఇప్పటి వరకు అక్రమార్కులపై రూ.5.75 లక్షలు జరిమానా కూడా విధించామని, పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులతో జిల్లా స్థాయి టాస్క్పోర్స్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
News October 6, 2024
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో విన్నర్గా సిక్కోలు విజయం
విజయవాడలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో భాగంగా శ్రీకాకుళం జిల్లా జట్టు పాల్గొంది. ఈ క్రమంలో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలో జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచిందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాబురావు, బమ్మిడి శ్రీరామ మూర్తి ఆదివారం తెలిపారు. నేడు కూడా పలు పోటీలు కొనసాగుతున్నాయని దీనిలో భాగంగా జిల్లా క్రికెట్ జట్టు సెమీఫైనల్కు వచ్చిందన్నారు.