News November 20, 2024

మాజీ సీఎం జగన్‌ను కలిసిన వెన్నపూస రవీంద్రారెడ్డి

image

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అనంతపురం నగరానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు వెన్నపూస రవీంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఉమ్మడి జిల్లాలోని పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News October 26, 2025

అనంతపురంలో రేపు పీజీఆర్ఎస్

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఈ నెల 27న రేపు ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన దరఖాస్తు స్లిప్పులను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News October 26, 2025

మోంతా ఎఫెక్ట్: అనంతపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మోంతా తుఫాను దూసుకొస్తోంది. దీంతో అనంతపురం జిల్లా అధికారులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అత్యవసర వేళ 85002 92992 నంబరుకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. తుఫాను పర్యవేక్షణ కోసం జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి వడరేవు వినయ్ చంద్‌ను ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది.

News October 26, 2025

Pic Of The Day

image

తాడిపత్రి పరిసరాలు పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు ఆకర్షణీయ స్థలంగా మారుతున్నాయి. ఆలూరు కోన దేవస్థానం, జలపాతం, ఓబులేసు కోన ఘాట్ రోడ్లు తిరుమల దారులను తలపిస్తున్నాయి. అక్కడి నుంచి కనిపించే పచ్చని కొండలు, పంట పొలాలు తాడిపత్రి అందాలను మరింత అద్భుతంగా చూపిస్తున్నాయి. సెలవుల్లో ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని ప్రకృతి అందాలు, పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు.