News October 25, 2024
మాజీ సీఎం జగన్పై దేవినేని ఉమా ట్వీట్

మాజీ సీఎం వైఎస్ జగన్ పై మాజీ మంత్రి దేవినేని ఉమా ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ‘ఆరేళ్లుగా కోడి కత్తి కేసులో ఎందుకు సాక్ష్యం చెప్పలేదు? అధికారం కోసం ఆడిన రాజకీయ డ్రామాతో ఒక దళితుడిని బలిచేశారు. అబద్ధాలు, అసత్యాలతో రాజకీయ లబ్ధి పొందారు. ఐదున్నరేళ్లుగా జైలులో మగ్గినా పట్టించుకోలేదు. సాక్ష్యం చెప్పమని నిరాహార దీక్ష చేసిన కుటుంబాన్ని హింసించారు’ అని శుక్రవారం ట్వీట్ చేశారు.
Similar News
News December 22, 2025
కృష్ణా: పల్స్ పోలియో నిర్వహణలో మన జిల్లాకే స్టేట్ ఫస్ట్.!

5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడంలో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో 95.49% మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి యుగంధర్ తెలిపారు. 1,45,588 మంది చిన్నారులకు గాను 1,39,024 మందికి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామన్నారు.
News December 22, 2025
నేడు కలెక్టరేట్లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్: కలెక్టర్

మచిలీపట్నంలోని కలెక్టరేట్లో నేడు ఎంప్లాయిస్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 10.30 నుంచి మీకోసం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు.
News December 22, 2025
నేడు కలెక్టరేట్లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్: కలెక్టర్

మచిలీపట్నంలోని కలెక్టరేట్లో నేడు ఎంప్లాయిస్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 10.30 నుంచి మీకోసం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు.


