News March 2, 2025
మాజీ స్పీకర్ చిత్రపటానికి MHBD కలెక్టర్ నివాళి

దుదిల్ల శ్రీపాదరావు మాజీ స్పీకర్ జయంతి వేడుకలను మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ హాజరయి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.
Similar News
News November 8, 2025
వరంగల్: త్రిసభ్య కమిటీ నివేదిక ఏమైంది..?

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో టెండర్లు లేకుండా రూ.2 కోట్ల వరకు నిధులను ఖర్చు చేశారనే ఆరోపణలపై <<18148710>>డీఎంఈ ముగ్గురితో విచారణకు<<>> ఆదేశించిన విషయం తెలిసిందే. అక్టోబరు 30న సాయంత్రం 5 గంటల్లోపే నివేదికను తనకు అందజేయాలంటూ ఆర్డర్లో ఇచ్చిన డీఎంఈకి.. అదే రోజు త్రిసభ్య కమిటీ సభ్యులు నివేదిక అందజేశారు. డీఎంఈకి నివేదిక అంది పది రోజులైనా ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
News November 8, 2025
జగిత్యాల: ‘వృద్ధుల హక్కుల పరిరక్షణకు కమిషన్ అవసరం’

సీనియర్ సిటిజెన్స్ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి కమిషన్ ఏర్పాటు చేయాలని టాస్కా రాష్ట్ర అధ్యక్షులు పి. నర్సింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో జరిగిన ప్రతినిధి మండలి సమావేశంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 46 మంది సీనియర్ సిటిజన్లను సన్మానించారు.
News November 8, 2025
దమ్మన్నపేట రచ్చబండ…గ్రామ చరిత్రకు ప్రతీక

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలోకి అడుగుపెట్టగానే కనిపించే పాత వేపచెట్టు కింద ఉన్న రచ్చబండ గ్రామానికి ప్రత్యేక గుర్తుగా నిలుస్తోంది. దాదాపు 2 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ “కచ్చిరి” వద్ద నిజాం రాజు కాలంలో స్వాతంత్ర్య సమరయోధులు దేశభక్తి చర్చలు జరిపేవారని పెద్దలు చెబుతున్నారు. ఇప్పటికీ పెద్దలు ఉదయం, సాయంత్రం కలిసి కూర్చుని గ్రామ విషయాలు మాట్లాడుకునే ఆత్మీయ స్థలంగా దీన్ని భావిస్తారు.


