News March 2, 2025

మాజీ స్పీకర్ చిత్రపటానికి MHBD కలెక్టర్ నివాళి

image

దుదిల్ల శ్రీపాదరావు మాజీ స్పీకర్ జయంతి వేడుకలను మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ హాజరయి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.

Similar News

News December 24, 2025

రేషన్ షాపుల్లో రూ.20కే గోధుమ పిండి

image

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో కిలో గోధుమ పిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది. మార్కెట్‌లో రూ.40 నుంచి రూ.80 వరకు ఉన్న ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. తొలుత జిల్లా కేంద్రాలు, ముఖ్యమైన పట్టణాలు, నగరాల్లో ఈ పథకం అమలుకానుంది. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. డిమాండ్‌ను బట్టి రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా సరఫరా చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.

News December 24, 2025

పాడి పశువులను అలా కట్టేసే ఉంచుతున్నారా?

image

చాలా మంది పాడి రైతులు పశువులను రోజంతా అలా కట్టేసి ఉంచుతారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు వెటర్నరీ నిపుణులు. దీని వల్ల వాటికి గాయాలు కావడంతో పాటు మానసిక ఒత్తిడికి గురవడంతో పాటు క్రమంగా దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతుందని అంటున్నారు. వాటిని కచ్చితంగా ఉదయం, సాయంత్రం కాసేపు నడిపించాలని సలహా ఇస్తున్నారు. వాటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, పశువులకు రోజూ స్నానం చేయించాలని సూచిస్తున్నారు.

News December 24, 2025

నారాయణపేట: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

నారాయణపేట జిల్లాలోని ధన్వాడ, కొత్తపల్లి, మాగనూర్, మక్తల్ మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే <>ఇక్కడ క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి.<<>>