News November 11, 2024
మాజీ MLA వర్మకు కీలక పదవి?

టీడీపీ ప్రభుత్వం 2 సార్లు నామినేటెడ్ పోస్టులను విడుదల చేసింది. అయితే కూటమి ప్రభుత్వం కలయికతో మాజీ MLA వర్మకు దక్కుతుందని ఆశించిన పిఠాపురం సీటును జనసేనకు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా టీడీపీ విడుదల చేసిన నామినేటెడ్ పోస్టుల్లో కూడా వర్మకు చోటివ్వలేదు. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం చంద్రబాబుతో వర్మ భేటీ కానున్నారని MLC కేటాయించే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
Similar News
News September 13, 2025
తూ.గో: కొత్త కలెక్టర్ను కలిసిన ఆర్డీవో

తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్గా కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం కలెక్టర్గా పనిచేస్తున్న పి. ప్రశాంతి బదిలీపై వెళ్లారు. రాజమండ్రి జిల్లా కలెక్టరేట్లో నూతన కలెక్టర్ కీర్తి చేకూరిని కొవ్వూరు ఆర్డీవో రాణి సుష్మిత మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛం అందజేశారు.
News September 13, 2025
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరి

తూర్పు గోదావరి జిల్లా మెజిస్ట్రేట్ & కలెక్టర్గా కీర్తి చేకూరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. ఆమెకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు.
News September 13, 2025
వర్జీనియా పొగాకు ధర అధరహో

వర్జీనియా పొగాకు ధరలు శుక్రవారం ఒక్కసారిగా పెరిగాయి. గత ఏడాది కిలో క్వాలిటీ పొగాకు గరిష్ఠ ధర రూ.411 ఆల్ టైమ్ రికార్డు కాగా ప్రస్తుతం రూ.418 పలికింది. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం–32లో కిలో పొగాకు ధర రూ.418, వేలం కేంద్రం–18లో రూ.417, కొయ్యలగూడెంలో రూ.418, గోపాలపురంలో రూ.416, దేవరపల్లిలో రూ.416 ధర పలికింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.