News December 8, 2024
మాజేరులో ధాన్యం పరిశీలించిన కలెక్టర్

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. చల్లపల్లి మండలం మాజేరు, ఘంటసాల మండలం లంకపల్లి, పూషడం, దేవరకోట గ్రామాల్లో పర్యటించి రోడ్డు వెంబడి ఆరబోసుకున్న ధాన్యం పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 17, 2025
‘కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టండి’

కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలన్న డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని రాధా-రంగా మిత్ర మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు కలెక్టర్ డీకే బాలాజీని కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన రంగా పేరును జిల్లాకు పెట్టాలని పెద్ద ఎత్తున పోరాడుతున్నామన్నారు.
News November 17, 2025
‘కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టండి’

కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలన్న డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని రాధా-రంగా మిత్ర మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు కలెక్టర్ డీకే బాలాజీని కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన రంగా పేరును జిల్లాకు పెట్టాలని పెద్ద ఎత్తున పోరాడుతున్నామన్నారు.
News November 17, 2025
కృష్ణా: అధికారుల పనితీరుపై కలెక్టర్ అసహనం

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కార చర్యలపై కొంత మంది అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్ అర్జీల స్వీకరణకు ముందు అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రీ ఓపెన్ అర్జీలు వస్తుండటంపై అసహనం వ్యక్తం చేశారు. అవగాహన లేక చేసే తప్పుల వల్లే అర్జీలు రీ ఓపెన్ అవుతున్నాయన్నారు.


