News February 2, 2025

మాడుగుల: అతిగా మద్యం తాగిన వ్యక్తి మృతి

image

మాడుగుల మండలం ఎం.కోటపాడు గ్రామంలో అతిగా మద్యం తాగిన జి.మోహన్రావు (48) మృతి చెందాడు. మూడు రోజుల కిందటి నుంచి మోహన్ రావు ఎవరికీ కనిపించలేదు. ఇంట్లో ఉంటాడని భావించిన బంధువులు శనివారం డోర్ తీయగా మృతి చెంది కనిపించాడు. మాడుగుల పోలీస్ స్టేషన్‌లో బంధువులు ఫిర్యాదు చేశారు. మోహన్ రావు భార్య, కుమార్తె వద్దకు వెళ్లింది. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 21, 2025

భూపాలపల్లి జిల్లా ఎస్పీగా సిరిశెట్టి సంకీర్త్

image

భూపాలపల్లి జిల్లా ఎస్పీగా సిరిశెట్టి సంకీర్త్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏటూరునాగారం ఏఎస్పీగా పనిచేసిన సిరిశెట్టి సంకీర్త్ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఏసీడీగా బాధ్యతలు నిర్వహించారు. అక్కడే ఎస్పీగా ప్రమోట్ అవ్వగా, నేడు జరిగిన బదిలీల్లో భూపాలపల్లి ఎస్పీగా నియామకమయ్యారు. కాగా 2023 వరదల సహాయక చర్యల్లో సిరిశెట్టి సంకీర్త్ మంచి గుర్తింపు వచ్చింది.

News November 21, 2025

టాటా డిజిటల్‌లో భారీగా లేఆఫ్‌లు

image

టాటా గ్రూప్‌లో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. TCSలో ఉద్యోగుల తొలగింపు తరువాత, ఇప్పుడు టాటా డిజిటల్‌‌లోనూ ఎంప్లాయీస్‌ను తగ్గించేందుకు సిద్ధమవుతోంది. టాటా న్యూ పనితీరు గత రెండేళ్లుగా ఊహించిన స్థాయిలో లేదు. దీంతో కొత్త CEO సజిత్ శివానందన్‌ పునర్‌వ్యవస్థీకరణను ప్రారంభించారు. ఇందులో భాగంగా TATA NEUలోని 50% ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. అన్ని డిజిటల్ సేవలను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు.

News November 21, 2025

UG&PG సైన్స్ స్కాలర్‌షిప్‌ నేడే లాస్ట్ డేట్

image

సైన్స్ విద్యార్థినులకు L’Oréal India అందించే స్కాలర్‌షిప్ అప్లికేషన్ గడువు ఈరోజుతో ముగుస్తోంది. UG&PG ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినుల మినహా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వార్షికాదాయం 6 లక్షల్లోపు, ఇంటర్‌లో 85%, డిగ్రీలో 60% మార్కులు వచ్చి ఉండాలి. UG విద్యార్థులకు రూ.62,500, PG & PhD విద్యార్థులకు రూ.1,00,000 వరకు స్కాలర్‌షిప్ అందుతుంది. వెబ్‌సైట్: <>https://www.foryoungwomeninscience.co.in/<<>>