News January 26, 2025

మాడుగుల నాగఫణి శర్మకు ‘పద్మశ్రీ’ అవార్డు.. బయోడేటా ఇదే..!

image

అనంతపురం(D) పుట్లూరు(M) కడవకల్లుకు చెందిన మాడుగుల నాగఫణిశర్మ ఆర్ట్ విభాగంలో పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. నాగభూషణశర్మ, సుశీలమ్మకు 1959లో జన్మించారు. పదో తరగతి పుట్లూరులో చదివి, సాహిత్య శిరోమణి పట్టా కోసం తిరుపతి వెళ్లారు. ఆంధ్ర, మైసూర్, ఢిల్లీ విశ్వవిద్యాలయాలలో చదివారు. 1985-90లో కడపలో సంస్కృత ఉపన్యాసకుడిగా చేశారు. 1990-92 మధ్యకాలంలో టీటీడీ ధర్మప్రచార పరిషత్తు అడిషనల్ కార్యదర్శిగా పనిచేశారు.

Similar News

News November 13, 2025

భార్యను హతమార్చిన భర్త

image

అనంతపురం జిల్లా బెలుగుప్పలో గురువారం దారుణ ఘటన జరిగింది. భార్యను భర్త హతమార్చాడు. స్థానికుల వివరాల మేరకు.. భార్య శాంతిని భర్త ఆంజనేయులు కొడవలితో నరికి చంపాడు. హత్య తర్వాత నిందితుడు బెలుగుప్ప పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కుటుంబ కలహాలే ఘటనకు కారణంగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 13, 2025

భార్యపై హత్యాయత్నం.. భర్త అరెస్టు: సీఐ

image

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో భార్య రత్నమ్మపై హత్యాయత్నం చేసిన ఆమె <<18270800>>భర్త<<>> ఎర్రి స్వామిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బుధవారం రాత్రి ఎర్రి స్వామి కత్తితో రత్నమ్మ గొంతు కోయడానికి యత్నించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు రూరల్ సీఐ హరినాథ్ తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

News November 12, 2025

గుత్తిలో వ్యక్తి మృతి

image

గుత్తిలోని కర్నూల్ రోడ్డులో నిరుపయోగంగా ఉన్న హాస్టల్ ఆవరణలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.