News February 20, 2025

మాదక ద్రవ్యాల వినియోగంపై నిఘాను పెంచండి: కలెక్టర్ 

image

మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సంబందిత శాఖలు నిబద్ధతతో విధులు నిర్వహించాలని కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నార్కోటిక్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. గంజాయి, ఎండీఎం, కోకైన్ వంటి మాదక ద్రవ్యాలు ఎక్కువుగా 18 నుంచి 24 వయస్సు వారు తీసుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు. విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగంను అరికట్టేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు.

Similar News

News December 20, 2025

మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో గుంటూరు పోలీసుల పతక వర్షం

image

నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన 44వ ఏపీ రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2025లో గుంటూరు జిల్లా పోలీస్ సిబ్బంది సత్తా చాటారు. ముగ్గురు ఏఎస్ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు కలిపి ఆరుగురు పాల్గొని మొత్తం 18 పతకాలు (14 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం) సాధించారు. వివిధ వయో విభాగాల్లో ట్రాక్, ఫీల్డ్ ఈవెంట్లలో మెరిసిన విజేతలను ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.

News December 20, 2025

తాడేపల్లి: KCR, KTR ఫొటోలతో జగన్ ఇంటి వద్ద కటౌట్లు

image

తాడేపల్లిలోని మాజీ CM జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పలు రాజకీయ కటౌట్లు వెలిశాయి. అయితే ఒక కటౌట్‌లో తెలంగాణ మాజీ CM KCR, KTR ఫొటోలూ ఉన్న ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. TGలోని షేర్‌ లింగంపల్లికి చెందిన BRS నేత చిర్రా రవీందర్ యాదవ్ దీనిని ఏర్పాటు చేశారు. APలోనే కాదు TGలోనూ జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఉన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

News December 20, 2025

నేడు జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. “పర్యావరణంలో అవకాశాలు” అనే థీమ్‌తో ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. పరిశుభ్రత, ప్రజా ఆరోగ్యం, పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రీసైక్లింగ్‌, వేస్ట్-టు-వెల్త్ కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.