News August 29, 2024
మాదాపూర్: దుర్గం చెరువులోని 204 భవనాలకు నోటీసులు

హైడ్రా కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీల్లో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల GHMC అధికారులు 204 ఇళ్లకు నోటీసులివ్వడంతో బిక్కుబిక్కుమంటున్నారు. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో CM సోదరుడు తిరుపతి రెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉన్నాయి. ఎఫ్టీఎల్లో ఉన్న ఇంటిపై ఎఫ్ అని మార్కింగ్ కూడా చేశారు.
Similar News
News September 17, 2025
HYD: సాయుధ పోరాటంలో డియర్ కామ్రేడ్స్

తెలంగాణ సాయుధ పోరాటం.. HYD సంస్థానంలో విప్లవం రగిల్చిన మహోత్తర ఘట్టం. ప్రాణాలు పోతోన్నా రజాకార్లకు ఎదురొడ్డిన వీర గాథలు కోకొల్లలు. ‘ఏ జంగ్ హై జంగే ఆజాదీ’ నినాదంతో మక్దూం మోహియుద్దీన్ కామ్రేడ్లను ఏకం చేస్తే, కమ్యూనిస్ట్, రైతాంగ పోరాటంలో రాజ బహదూర్ గౌర్ కీలకంగా వ్యవహరించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి జైలుకెళ్లారు. ప్రజలను నిత్యం చైతన్యం వైపు నడిపించిన కామ్రేడ్స్ SEP 17న అందరి గుండెల్లో నిలిచారు.
News September 17, 2025
HYD: SEP 17.. ఇదే కదా నిజమైన సాతంత్ర్యం!

1947, AUG 15.. దేశమంతా స్వేచ్ఛా గాలులు పీల్చుతుంటే HYD ప్రజలు నిజాం, దొరలు, రజాకార్ల నిర్బంధంలో ఉన్నారు. అప్పటికే(1946) తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పురుడుపోసుకుంది. భారత స్వాతంత్ర్య స్ఫూర్తి HYD సంస్థానాన్ని ఆహ్వానించిందేమో మరి.. ఏళ్లుగా ఏడ్చిన కళ్లు ఎర్రబడ్డాయి. నీ బాంచన్ దొర అన్న జనం బ్యాంచత్ అని రాయి, రప్ప, సుత్తె, కత్తి చేతబట్టి పోరాడారు. చివరకు 1948 SEP 17న ‘ఆపరేషన్ పోలో’తో స్వేచ్ఛను పొందారు.
News September 17, 2025
హైదరాబాద్లో 50 మంది CIల బదిలీ

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్స్పెక్టర్ల బదిలీలు, పదోన్నతులు జరిగాయి. తాజాగా కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 50 మంది ఇన్స్పెక్టర్లకు బదిలీ, పదోన్నతి ఇచ్చినట్లు వెల్లడించారు. చాలా రోజుల నుంచి ఒకే పోస్టింగ్లో ఉన్న వారిని సైతం ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేశారు.