News August 29, 2024
మాదాపూర్: దుర్గం చెరువులోని 204 భవనాలకు నోటీసులు

హైడ్రా కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీల్లో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల GHMC అధికారులు 204 ఇళ్లకు నోటీసులివ్వడంతో బిక్కుబిక్కుమంటున్నారు. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో CM సోదరుడు తిరుపతి రెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉన్నాయి. ఎఫ్టీఎల్లో ఉన్న ఇంటిపై ఎఫ్ అని మార్కింగ్ కూడా చేశారు.
Similar News
News October 17, 2025
HYD: IPS బ్యాచ్ పాసింగ్ పరేడ్కు BSF DG

HYDలోని SVP నేషనల్ పోలీస్ అకాడమీలో 77వ RR IPS బ్యాచ్ శిక్షణ పూర్తైంది. మొత్తం 190 మంది IPSలు, అందులో 65మంది మహిళలు (36%) ఉన్నారు. 50% మంది ఇంజినీరింగ్ నేపథ్యంతో అభ్యర్థులు ఉన్నారు. పరేడ్కు BSF DG దల్జిత్ సింగ్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై, ప్రతిభావంతులైన ట్రైనీలకు అవార్డులు అందజేయానున్నారు. 49 వారాల పాటు కఠిన శిక్షణ పూర్తిచేసిన అధికారులు త్వరలో బాధ్యతలు చేపడతారు.
News October 17, 2025
HYD: ఏపీ మహిళపై అత్యాచారం చేసింది ఇతడే

రైలులో ప్రయాణికురాలిపై <<18009296>>అత్యాచారం<<>> కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని గుంటూరు రైల్వే పోలీసులు తెనాలిలో అదుపులోకి తీసుకన్నారు. పల్నాడులోని సత్తెనపల్లి పరిధి లక్కరాజుగార్లపాడుకు చెందిన జోన్నలగడ్డ రాజారావుగా గుర్తించారు. 2 నెలల క్రితం కేరళకు చెందిన మహిళపైనా అతడు అత్యాచారం చేసినట్లు వెల్లడైంది. మంగళవారం సికింద్రాబాద్ వస్తున్న సంత్రగాచి ఎక్స్ప్రెస్లో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
News October 17, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ ట్రాఫిక్ డైవర్షన్స్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల కారణంగా నేడు ఉ.10 నుంచి మ.4 వరకు యూసుఫ్గూడ, కృష్ణానగర్, కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలు పాటించలని, పార్కింగ్ కోసం మెట్రో పార్కింగ్ (జానకమ్మ తోట), సవేరా & మహమూద్ ఫంక్షన్ హాల్స్ అందుబాటులో ఉంటాయని, ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.