News August 29, 2024
మాదాపూర్: దుర్గం చెరువులోని 204 భవనాలకు నోటీసులు

హైడ్రా కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీల్లో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల GHMC అధికారులు 204 ఇళ్లకు నోటీసులివ్వడంతో బిక్కుబిక్కుమంటున్నారు. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో CM సోదరుడు తిరుపతి రెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉన్నాయి. ఎఫ్టీఎల్లో ఉన్న ఇంటిపై ఎఫ్ అని మార్కింగ్ కూడా చేశారు.
Similar News
News November 5, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: BJP కోసం పవన్?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గరపడింది. ప్రచారానికి కేవలం 4 రోజులు సమయం ఉంది. చివరి ప్రసంగాలు ఓటర్లను ప్రభావితం చేస్తాయి. అందుకే అభ్యర్థులు, పార్టీల అగ్ర నాయకులు ప్రచారం జోరుగా చేస్తున్నారు. BJP తరఫున ప్రచారం చేయనున్నారని జనసేన తెలంగాణ ప్రెసిడెంట్ శంకర్ గౌడ్ తెలిపారు. TBJP నేతలతో సమావేశమైన ఆయన ఈ విషయం తెలిపారు. APలో BJP, జనసేన, TDP కూటమిగా ప్రభుత్వం నడుపుతున్న నేపథ్యంలో పవన్ ప్రచారం చేయనున్నారు.
News November 5, 2025
జూబ్లీహిల్స్ బై పోల్: డ్రోన్లకు పర్మిషన్ ఇవ్వండి!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో తమ పార్టీ అగ్ర నేతలు కేటీఆర్, హరీశ్ రావులు పాల్గొంటున్నారని.. వారి భద్రత దృష్ట్యా డ్రోన్లు వాడుతామని బీఆర్ఎస్ నాయకులు సీపీ సజ్జనార్ను కోరారు. స్థానికంగా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉపయోగిస్తామని సీపీకి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. అయితే ఇందుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ లభించలేదని సమాచారం. మరి పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
News November 5, 2025
కూతురితో కలిసి హుస్సేన్సాగర్లో దూకి సూసైడ్

హుస్సేన్సాగర్లో దూకి తల్లీబిడ్డ తనువు చలించారు. లేక్ పోలీసుల వివరాలు.. CA కీర్తిక అగర్వాల్(28), ఆమె పాప కనిపించడం లేదని బహదూర్పురా PSలో మిస్సింగ్ కేసు నమోదైంది. NOV 2న హుస్సేన్సాగర్లో ఓ యువతి మృతదేహం లభ్యం అవగా విచారించిన పోలీసులు చనిపోయింది కీర్తిక అని గుర్తించారు. భర్తతో విభేదాల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు నిర్ధారించారు. పాప మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు చేపట్టారు.


