News February 25, 2026

మాదారం చెరువులో వ్యక్తి గల్లంతు

image

ఊర్కొండ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మండలంలోని మాదారం చెరువులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాచాలపల్లి గ్రామానికి చెందిన బూర వెంకటయ్య (42) అనే వ్యక్తి బుధవారం మాదారం చెరువు వద్దకు చేపల వేటకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు ఆయన చెరువులో పడి గల్లంతైనట్లు తెలుస్తోంది. వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 18, 2026

కొత్త SEకి కలెక్టర్ సూచన

image

వరంగల్ విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆనందం శుక్రవారం కలెక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన విద్యుత్ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. జూన్ 2న భవనాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నందున పనుల్లో పురోగతి సాధించాలని ఆదేశించారు. ఈ భేటీలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు.

News April 18, 2026

కామారెడ్డి: అప్పుల బాధతో మహిళ రైతు ఆత్మహత్య

image

కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులో శుక్రవారం సాయంత్రం ఓ మహిళ రైతు తన పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు దోమకొండ మండలం చింతమాన్‌పల్లి గ్రామానికి చెందిన లింగవ్వగా గుర్తించారు. భర్త మరణం తర్వాత అప్పుల భారం భరించలేక పాల్పడినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 18, 2026

కామారెడ్డి: అప్పుల బాధతో మహిళ రైతు ఆత్మహత్య

image

కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులో శుక్రవారం సాయంత్రం ఓ మహిళ రైతు తన పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు దోమకొండ మండలం చింతమాన్‌పల్లి గ్రామానికి చెందిన లింగవ్వగా గుర్తించారు. భర్త మరణం తర్వాత అప్పుల భారం భరించలేక పాల్పడినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.