News February 25, 2025

మాదిగ అమరవీరుల కుటుంబాల కాళ్లు కడిగిన మంత్రి రాజనర్సింహ

image

హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో జరుగుతున్న మాదిగ అమరవీరుల సంస్మరణ సభలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ కులాల్లో అసమానతల వల్లే ఆందోళనలు మొదలయ్యాయన్నారు. హక్కుల సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటంలో అసువులు బాసిన అమరులకు ఈరోజు నివాళులర్పిస్తున్నామన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యుల కాళ్లు కడిగారు. ఈ సందర్భంగా వారికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.

Similar News

News February 26, 2025

MNCL: అప్పుల బాధతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

మంచిర్యాలలోని రాజీవ్‌నగర్‌లో రామటెంకి బాణేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని SI ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బాణేశ్‌కు 2022లో గుండెకు స్టంట్స్ వేశారు. రెండో భార్య పుష్ప వివాహేతర సంబంధం విషయంలో గొడవలు కావడంతో వెంకటేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదై జైలుకు వెళ్లొచ్చారు. ఈ క్రమంలో అప్పులుకావడంతో భార్య పనికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉరేసుకున్నారు.

News February 26, 2025

నంద్యాల జిల్లాకు జబర్దస్త్ నటుడి రాక

image

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్‌తో పాటు, పలు నాటక ప్రదర్శనలు, సినిమాల్లో కామెడీ ఆర్టిస్టుగా నటిస్తూ ప్రజలను మెప్పిస్తున్న జబర్దస్త్ నటుడు అప్పారావు నేడు (బుధవారం) కొలిమిగుండ్ల మండలం పెట్నికోటకు రానున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెట్నికోట శ్రీ గుండు మల్లేశ్వర స్వామి సన్నిధిలో బుధవారం రాత్రి చింతామణి నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో అప్పారావు సుబ్బిశెట్టి పాత్ర వేస్తున్నారు.

News February 26, 2025

నెల్లూరులో శివ‌రాత్రి శోభ‌.. విద్యుత్ కాంతుల్లో ఆలయాలు

image

మహాశివ‌రాత్రి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకొని, నెల్లూరులోని శైవ‌క్షేత్రాలన్నీ విద్యుత్ కాంతుల‌తో ముస్తాబ‌య్యాయి. బుధ‌వారం శివ‌రాత్రి సంద‌ర్భంగా న‌గ‌రంలోని మూలాపేట, న‌వాబుపేట‌, గ‌ణేష్ ఘాట్, గుప్తా పార్క్, వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి త‌దిత‌ర శైవ క్షేత్రాల‌లో అన్నీ ఏర్పాట్లు చేశారు. ఆల‌యాల్లో భ‌క్తుల‌కి ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల‌య అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

error: Content is protected !!