News June 24, 2024
మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ తలదించుకునే అంశం: భట్టి

నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన చెంచు గిరిజన మహిళ ఈశ్వరమ్మపై జరిగిన అత్యాచారం ఘటన అమానవీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఉదయం నిమ్స్ ఆస్పత్రిలో బాధితురాలు ఈశ్వరమ్మను, కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మంత్రి జూపల్లితో కలిసి మాట్లాడారు. ఘటనలో పూర్తి సమాచారం సేకరించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
Similar News
News December 12, 2025
బోనకల్ సర్పంచ్గా భార్య, వార్డు సభ్యుడిగా భర్త విజయం

బోనకల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాణోత్ జ్యోతి సర్పంచ్గా ఘన విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థి భూక్య మంగమ్మపై 962 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఈ విజయం కంటే ఆసక్తికరంగా, జ్యోతి భర్త బాణోత్ కొండ 4వ వార్డు సభ్యుడిగా గెలుపొందారు. ఈ అపూర్వ విజయంతో గ్రామంలో వారి అనుచరులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
News December 12, 2025
ఖమ్మం: నేటితో రెండో విడత ప్రచారం ముగింపు

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రచార గడువు నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం వంటి 6 మండలాల్లో అభ్యర్థులు చివరి రోజు ఇంటింటి ప్రచారానికి పదును పెడుతున్నారు. ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లను ప్రసన్నం చేసుకునే వ్యూహాలకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.
News December 12, 2025
KMM: తొలివిడతలో సత్తా చాటిన కాంగ్రెస్ అభ్యర్థులు

ఖమ్మం జిల్లాలో జరిగిన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (7 మండలాల్లో) కాంగ్రెస్ పార్టీ-136, బీఆర్ఎస్-34, సీపీఐ-6, సీపీఎం-10, టీడీపీ-2, ఇండిపెండెంట్-4 స్థానాల్లో విజయం సాధించారు. అధికంగా వైరా మండలంలో మొత్తం 22 గ్రామ పంచాయితీల్లో 20 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఎం-1, బీఆర్ఎస్- 1 స్థానాల్లో నిలిచారు.


