News January 26, 2025
మానవపాడు: నేడు ఆ గ్రామంలోనే పథకాల ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించనున్న నాలుగు పథకాలను మానవపాడు మండలం చంద్రశేఖర్ నగర్ గ్రామంలో ప్రారంభిస్తున్నట్లు మానవపాడు ఎంపీడీఓ భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నేడు మధ్యాహ్నం 1 గంటలకు నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొననున్నారని ఆయన తెలిపారు.
Similar News
News December 9, 2025
సేవల్లో మార్పులకు శ్రీకారం: పవన్ కళ్యాణ్

పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన సుమారు 2,000 మంది ఉద్యోగులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు CK కన్వెన్షన్ హాల్లో సమావేశం కానున్నారు. ప్రజాసేవల మెరుగుదల, ఫీల్డ్ సమస్యలు, పరిపాలనా లోపాలపై నేరుగా చర్చించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పదోన్నతులతో ఉత్సాహంతో ఉన్న ఉద్యోగుల ద్వారా ప్రజలకు సేవల ప్రమాణం పెంచడంపై పవన్ స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
News December 9, 2025
మొదటి విడత ఎన్నికలు.. 700 మందితో పటిష్ఠ బందోబస్తు

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో బందోబస్తు సిద్ధం చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధులపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మొదటి విడతలో 700 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. అదనపు ఎస్పీ చంద్రయ్య పాల్గొన్నారు.
News December 9, 2025
మంచిర్యాల: సింగరేణి ఉద్యోగులకు సెలవు

ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయితీ ఎన్నికలలో సింగరేణి ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా సెలవు ప్రకటిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఫస్ట్, జనరల్ షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులకు షిఫ్ట్ ప్రారంభంలో రెండు గంటల సెలవు, ఫ్రీ షిఫ్టులో పనిచేసే వారికి ఉదయం 11 గంటల నుంచి అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొంది.


