News January 26, 2025
మానవపాడు: నేడు ఆ గ్రామంలోనే పథకాల ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించనున్న నాలుగు పథకాలను మానవపాడు మండలం చంద్రశేఖర్ నగర్ గ్రామంలో ప్రారంభిస్తున్నట్లు మానవపాడు ఎంపీడీఓ భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నేడు మధ్యాహ్నం 1 గంటలకు నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొననున్నారని ఆయన తెలిపారు.
Similar News
News November 14, 2025
ఇందిరా మహిళా శక్తి చీరల లక్ష్యాన్ని చేరాలి: ఇన్ఛార్జి కలెక్టర్

సిరిసిల్ల: మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందిస్తున్న ఇందిరా మహిళా శక్తి యూనిఫాం చీరల క్లాత్ ఆర్డర్ లక్ష్యాన్ని తప్పక చేరాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై కలెక్టరేట్లో చేనేత జౌళి శాఖ అధికారులు, వస్త్ర పరిశ్రమ కార్మికులు, ఆసాములు, యజమానులతో శుక్రవారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. చీరల తయారీలో నాణ్యత పాటించాలని సూచించారు.
News November 14, 2025
PG పీజీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ లో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు ప్రకటించారు. ఎమ్మెస్సీ బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ నాలుగో సెమిస్టర్ ఫలితాలు ప్రకటించామన్నారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చని చెప్పారు.
News November 14, 2025
CII: 2 రోజుల్లోనే ₹7.15 లక్షల కోట్ల పెట్టుబడులు

AP: విశాఖలో నిర్వహిస్తున్న CII సదస్సు మంచి ఫలితాలిస్తోంది. నిన్న, ఇవాళ కలిపి ₹7,14,780 CR పెట్టుబడులపై 75 MOUలు జరిగాయి. వీటి ద్వారా 5,42,361 ఉద్యోగాలు రానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
* తొలి రోజు సదస్సులో మొత్తంగా 40 కంపెనీలతో ₹3,49,476 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. వీటి ద్వారా 4,15,890 ఉద్యోగాలు వచ్చే అవకాశం.
* నిన్న 35 ఒప్పందాల ద్వారా ₹3,65,304 కోట్ల పెట్టుబడులు. వీటితో 1,26,471 ఉద్యోగాలు.


