News January 26, 2025

మానవపాడు: నేడు ఆ గ్రామంలోనే పథకాల ప్రారంభం

image

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించనున్న నాలుగు పథకాలను మానవపాడు మండలం చంద్రశేఖర్ నగర్ గ్రామంలో ప్రారంభిస్తున్నట్లు మానవపాడు ఎంపీడీఓ భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నేడు మధ్యాహ్నం 1 గంటలకు నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొననున్నారని ఆయన తెలిపారు.

Similar News

News November 14, 2025

టాస్ ప్రాక్టీస్ చేస్తున్న సౌతాఫ్రికా కెప్టెన్.. కారణమిదే!

image

కోల్‌కతాలో రేపు సౌతాఫ్రికా-ఇండియా మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రొటీస్ కెప్టెన్ బవుమా ఓ సరదా విషయాన్ని పంచుకున్నారు. ‘ఇటీవల కేన్ విలియమ్సన్‌ను కలిశా. భారత్‌ను ఓడించేందుకు కొన్ని పాయింట్స్ అడిగా. కేన్ పెద్దగా ఓపెన్ కాలేదు. కానీ టాస్ గెలవాలని చెప్పాడు. దీంతో అప్పటి నుంచి కాయిన్ టాస్ వేయడం ప్రాక్టీస్ చేస్తున్నా’ అని చెప్పారు. తాము సిరీస్ కోసం బాగానే సిద్ధమయ్యామని అనుకుంటున్నానని తెలిపారు.

News November 14, 2025

అన్నమయ్య జిల్లాలో విజిబుల్ పోలీసింగ్

image

ప్రజల భద్రతే లక్ష్యంగా ‘విజిబుల్ పోలీసింగ్’ ముమ్మరం చేసినట్లు అన్నమయ్య జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం గురువారం వెల్లడించింది. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు నేరుగా ప్రజల్లోకి వెళ్లి, వారి భద్రతకు భరోసా కల్పిస్తున్నారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.

News November 14, 2025

జీవకోన వాసికి 14 రోజుల రిమాండ్

image

భారీ స్థాయిలో గంజాయి సరఫరా చేస్తున్న స్మగ్లర్‌ను అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ రామకిశోర్ వివరాల మేరకు.. గురువారం గంజాయి తరలిస్తున్న జీవకోన వాసి జగదీష్ (37)ను ఉదయం 10 గంటలకు గోవింద హోమ్ స్టే సమీపంలో పట్టుకున్నారు. 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు.