News March 3, 2025
మానస.. ఆత్మ స్థైర్యానికి సెల్యూట్..!

చదవాలన్న సంకల్పం ముందు మానసిక అంగవైకల్యం తలవంచింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వి.ఎం.పేటకు చెందిన పెట్ల మానస ఇంటర్ పరీక్షలకు హాజరైంది. చిన్నప్పటి నుంచి మానసికస్థితి సరిగా లేకపోయినా తల్లిదండ్రుల సాయంతో చదువు కొనసాగిస్తోంది. ప్రస్తుతం HEC సెకండియర్ చదువుతున్న మానస.. తన తండ్రి దేముడు సాయంతో సోమవారం పరీక్షకు హాజరయ్యింది. సహాయకురాలి సాయంతో పరీక్ష రాసింది. ఆమె ఆత్మ స్థైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే.
Similar News
News March 20, 2025
VZM: నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి: SP

సైబరు నేరాలను చేధించేందుకు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. స్థానిక పోలీస్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లగా పని చేస్తున్న కానిస్టేబుళ్లకు బుధవారం అవగాహన కల్పించారు. రాబోయే రోజుల్లో సైబరు నేరాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నేరాలను నియంత్రించుట, నమోదైన కేసుల్లో దర్యాప్తు చేపట్టుటకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతీ పోలీసు అధికారి మెరుగుపర్చుకోవాలన్నారు.
News March 19, 2025
VZM: ZP ఛైర్మన్కు మాజీ CM జగన్ పరామర్శ

విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ రెండో కుమారుడు ప్రణీత్ బాబు బుధవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్లో చిన్న శ్రీనును పరామర్శించారు. మృతికి గల కారణాన్ని అడిగి తెలుసుకున్నారు. చిన్న శ్రీను కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మనోధైర్యంగా ఉండాలంటూ జగన్ ధైర్యం చెప్పారు.
News March 19, 2025
VZM: “టెన్త్ పరీక్షకు 94 మంది గైర్హాజరు”

బుధవారం జిల్లా వ్యాప్తంగా జరిగిన 10వ తరగతి హిందీ పరీక్షకు 94 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈవో యు.మాణిక్యం నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 119 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకి మొత్తం 22,834 విద్యార్థులకు గాను 22740 మంది విద్యార్థులు హాజరయ్యారని అన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు సజావుగా జరిగిందని తెలియజేశారు.