News February 20, 2025
మామడ: మహిళ దారుణ హత్య

NZBజిల్లా ఏర్గట్ల మండలం నాగేంద్రనగర్కు చెందిన మహిళ హత్యకు గురైంది. పోలీసుల ప్రకారం.. మహిళకు భర్తతో విడాకులై ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో వెంకటేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆమెపై అనుమానం పెంచుకున్న నిందితుడు ఆమెను జనవరి 21న నిర్మల్ జిల్లా మామడకు రప్పించాడు. దిమ్మదుర్తి, నల్దుర్తి మార్గంలోని అడవిలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. నిందితుడిని రిమాండ్కి తరలించినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
Similar News
News March 18, 2025
RR కలెక్టరేట్లో 72 ఫిర్యాదులు స్వీకరణ

ప్రజావాణి ఆర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రజావాణిలో ఫిర్యాదుదారులు అందజేసిన ఆర్జీలను జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలసి స్వీకరించారు. అధికారులు తక్షణమే స్పందిస్తూ వెంటనే పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. రెవెన్యూ 40, ఇతర శాఖల్లో 32, మొత్తం 72 ఫిర్యాదులు స్వీకరించారు.
News March 17, 2025
పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు అనుమతి

పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. 2 కాంప్లిమెంటరీ స్టాళ్ల ఏర్పాటుకు లోక్సభ సచివాలయం అనుమతి ఇచ్చింది. సంగం, నలంద లైబ్రరీ వద్ద వాటిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు AP MP కలిశెట్టికి లోక్సభ డిప్యూటీ కార్యదర్శి అజిత్ లేఖ రాశారు. అరకు కాఫీకి ప్రచారం కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు TDP ఎంపీలు గతంలో లోక్సభ స్పీకర్ను కోరగా తాజాగా అనుమతి లభించింది.
News March 17, 2025
రాష్ట్రపతి అల్పాహార విందులో బైరెడ్డి శబరి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆతిథ్యంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతికి నమస్కారం చేశారు. రాష్ట్రపతి ఆహ్వానాన్ని ఎంతో గౌరవంగా, స్ఫూర్తిదాయకంగా భావిస్తున్నాని శబరి తెలిపారు.