News January 25, 2025
మామిడికుదురు: టెలిఫోన్ కేబుల్ వైర్ల చోరీకి యత్నం

మామిడికుదురు మండలం పాశర్లపూడి కొండాలమ్మ చింత సెంటర్లో పట్టపగలు టెలిఫోన్ కేబుల్ వైర్ల చోరీకి యత్నించిన సంఘటన కలకలం రేపింది. దీనిపై విచారణ చేపట్టామని నగరం ఎస్సై చైతన్యకుమార్ శనివారం తెలిపారు. జాతీయ రహదారి పక్కన భూమిలో పాతిన టెలికం వైర్లను చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్నారు. సంబంధిత శాఖకు చెందిన ఉద్యోగులు గోతులు తవ్వుతున్న మహిళలను పోలీసులకు అప్పగించారు. గతంలో ఇదే తరహాలో చోరీ చేశారన్నారు.
Similar News
News November 20, 2025
ANU: రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత ఏప్రిల్, ఫిబ్రవరిలో విడుదల చేసిన LLB 5 సంవత్సరాల రీవాల్యుయేషన్ ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు గురువారం విడుదల చేశారు. LLB 5 సంవత్సరాల ఫస్ట్ సెమిస్టర్, 3వ సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం వర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.
News November 20, 2025
క్షణికావేశంలో ఆత్మహత్యలు.. ఒక్కసారి ఆలోచించండి.!

అల్లారుముద్దుగా చూసుకున్న కూతురు పట్టాలపై <<18338200>>మాంసపు ముద్దలా<<>> మారిన వేళ.. బుడిబుడి నడకలు, చిలిపి చేష్టలకు సంబరపడ్డ తల్లిదండ్రులు తెగిపడ్డ తమ బిడ్డ శరీర భాగాలను చూసి తట్టుకోగలరా? కుప్పం(M)లో అనూష.. పేరంట్స్ మందలించారని తనువు చాలించింది. చిన్న చిన్న కారణాలకు ఎంతో మంది క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి విద్యార్థి దశలోనే కౌన్సెలింగ్ ఇస్తే ఇలాంటివి జరగవని పలువురు అంటున్నారు.
News November 20, 2025
WNP: చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. గురువారం వీపనగండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. బాల్య వివాహాల నిషేధ చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం, మోటార్ వాహనాల చట్టం, ఉచిత& నిర్బంధ విద్య హక్కు చట్టం, సైబర్ క్రైమ్స్ & డ్రగ్ అబ్యూస్ గురించి అవగాహన కల్పించారు.


