News January 25, 2025

మామిడికుదురు: టెలిఫోన్ కేబుల్ వైర్ల చోరీకి యత్నం

image

మామిడికుదురు మండలం పాశర్లపూడి కొండాలమ్మ చింత సెంటర్లో పట్టపగలు టెలిఫోన్ కేబుల్ వైర్ల చోరీకి యత్నించిన సంఘటన కలకలం రేపింది. దీనిపై విచారణ చేపట్టామని నగరం ఎస్సై చైతన్యకుమార్ శనివారం తెలిపారు. జాతీయ రహదారి పక్కన భూమిలో పాతిన టెలికం వైర్లను చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్నారు. సంబంధిత శాఖకు చెందిన ఉద్యోగులు గోతులు తవ్వుతున్న మహిళలను పోలీసులకు అప్పగించారు. గతంలో ఇదే తరహాలో చోరీ చేశారన్నారు.

Similar News

News December 9, 2025

వరల్డ్ టాప్ డిఫెన్స్ కంపెనీల జాబితాలో HAL

image

వరల్డ్ TOP-100 డిఫెన్స్ కంపెనీల జాబితాలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 44వ స్థానంలో నిలిచింది. BEL 58, మజ్గాన్ డాక్ 91 ర్యాంకుల్లో నిలిచాయని SIPRI నివేదిక పేర్కొంది. ప్రపంచ ఉద్రిక్తతలతో 2024లో జాబితాలోని 77 కంపెనీల ఆదాయం పెరిగినట్లు తెలిపింది. కాగా ఇండియా ఆయుధ విక్రయాలు 8.2% పెరిగి $7.5B ఆదాయం సమకూరింది. ఆయుధ ఆదాయంలో 49% వాటా USదే. చైనా 13%, UK 7.7%, రష్యా 4.6% ఇండియా 1.1% వాటా కలిగి ఉన్నాయి.

News December 9, 2025

నగలను ఎలా శుభ్రం చేయాలంటే?

image

నగలను సరిగా శుభ్రం చేయకపోతే చెమట, దుమ్ము చేరి వాటి మెరుపు తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే గోరువెచ్చని నీటిలో షాంపూ/ డిష్ వాష్ డిటర్జెంట్ కలిపి నగలను పావుగంట ఉంచాలి. తర్వాత టూత్ బ్రష్తో మృదువుగా రుద్దాలి. తర్వాత మంచినీటిలో రెండుసార్లు శుభ్రపరిచి పొడివస్త్రంలో వేసి మునివేళ్లతో అద్దాలి. తడి ఆరనిచ్చి, భద్రపరుచుకోవాలి. షాంపూకి బదులు కుంకుడు రసం కూడా వాడి నగలను శుభ్రం చేయొచ్చు.

News December 9, 2025

పెద్దపల్లి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల పెంపు: DMHO

image

పెద్దపల్లి జిల్లా ఆరోగ్య శాఖలో జరిగిన సమీక్షలో డా. వి. వాణిశ్రీ ఆసుపత్రి ప్రసవాలను పెంచాలని, ప్రతి ఫుల్ టర్మ్ గర్భిణీని ట్రాక్ చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం జరిగేలా అవగాహన కల్పించాలని సూచించారు. క్షయ లక్షణాలు ఉన్నవారికి వెంటనే పరీక్షలు చేయాలని ఆదేశించారు. యాంటీబయోటిక్స్‌ను అవసరం ఉన్నప్పుడే వాడాలని తెలిపారు. 30 ఏళ్లు పైబడిన వారికి ఎన్‌సి డి స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించారు.