News March 11, 2025

మామిళ్లపల్లి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి జాతర.. ఉచిత బస్సు సదుపాయం

image

ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు (జాతర) మార్చి 11 నుంచి 16 వరకు జరుగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం అచ్చంపేట ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దేవస్థాన కమిటీ కోరింది.

Similar News

News December 5, 2025

ఖమ్మం: KUలో త్వరలోనే ఫేస్ రికగ్నిషన్ హాజరు..!

image

కాకతీయ యూనివర్సిటీలో టీచింగ్, నాన్‌టీచింగ్(రెగ్యులర్, కాంట్రాక్టు, టైంస్కేల్, ఔట్‌సోర్సింగ్) ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానం అమలు చేయడానికి కేయూ సిద్ధమైంది. ఈనెల 6, 8వ తేదీల్లో ఉద్యోగులు తమ విభాగాల్లో అందుబాటులో ఉండాలని, ఫొటో క్యాప్చర్ కోసం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరిపాలన భవనానికి హాజరవాల్సిందిగా రిజిస్ట్రార్ రామచంద్రం వాట్సాప్ గ్రూప్ ద్వారా సూచించినట్లు సమాచారం.

News December 5, 2025

చిలకలూరిపేట ఘటనపై అధికారులను ఆరా తీసిన మంత్రి లోకేశ్

image

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందడంపై మంత్రి లోకేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు దుర్మరణం పాలవడం బాధాకరమన్నారు. ప్రమాద ఘటనపై అధికారులను ఆరా తీసి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని లోకేశ్‌ పేర్కొన్నారు.

News December 5, 2025

WGL: కబ్జారాయుళ్లపై నిఘా.. 150 మంది పేర్లతో జాబితా!

image

ట్రై సిటీలో కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల జాబితాను WGL పోలీసులు తయారు చేసినట్లు తెలిసింది. 360 మంది పేర్లతో కూడిన జాబితాను నిశితంగా పరిశీలించి, వాటి నుంచి 150 పేర్లతో కూడిన ఫైనల్ జాబితాను తయారు చేసి, వారిపై నిఘా పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రధాన నేతలకు సంబంధించిన కొందరు అనుచరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ జాబితాను రూపొందించారట.