News March 11, 2025

మామిళ్లపల్లి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి జాతర.. ఉచిత బస్సు సదుపాయం

image

ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు (జాతర) మార్చి 11 నుంచి 16 వరకు జరుగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం అచ్చంపేట ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దేవస్థాన కమిటీ కోరింది.

Similar News

News November 19, 2025

బాలల కోసం సినిమాల ప్రత్యేక ప్రదర్శనలు: ASF కలెక్టర్

image

జిల్లాలో బాలల కోసం సినిమా థియేటర్లలో పిల్లల చిత్రాల ప్రత్యేక ప్రదర్శన చేయనున్నట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. డిసెంబర్ 31 వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జిల్లాలోని సినిమా థియేటర్లలో పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేక చిత్ర ప్రదర్శనలు ఉంటాయన్నారు. విద్యార్థికి గ్రామీణ ప్రాంతాలలో రూ.25, పట్టణ ప్రాంతాలలో రూ.30గా టికెట్ ధర నిర్ణయించామని వెల్లడించారు.

News November 19, 2025

ఇన్‌ఛార్జుల పాలనలో ‘అప్పన్న’ సేవలు.. ఇంకెన్నాళ్లు?

image

సింహాచలం దేవస్థానానికి పూర్తిస్థాయి ఈవో లేకపోవడంతో ఇన్‌ఛార్జీల పాలనలోనే నెట్టుకొస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు 16సార్లు ఈవోలను మర్చారు. వెయ్యేళ్లకు పైగా చరిత్ర, వేల ఎకరాల భూములన్న దేవస్థానానికి పూర్తిస్థాయి ఈవో లేకపోవడంతో పాలన గాడి తప్పుతోంది. భక్తుల సేవల్లో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం విశాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న సుజాత పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో ఈవోగా కొనసాగుతున్నారు.

News November 19, 2025

ASF: 18 ఏళ్లు నిండిన మహిళకు చీరలు

image

రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ‘ఇందిరమ్మ మహిళా శక్తి’ పథకం కింద ఏకరూప చీరలు పంపిణీ చేయాలని సీఏం రేవంత్ రెడ్డి సూచించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ఆయన ఈ పథకంపై సమీక్ష నిర్వహించారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఏఎస్‌ఎఫ్ కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో చర్చించి పంపిణీ ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు.