News March 3, 2025
మారథాన్లో సిద్దిపేట కానిస్టేబుల్ సత్తా

కామారెడ్డి రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో నిర్వహించిన 21 కిలోమీటర్ల మారథాన్లో సిద్దిపేట కానిస్టేబుల్ అశోక్ సత్తా చాటాడు. వివిధ జిల్లాల నుంచి దాదాపు 300 మంది పాల్గొన్న మారథాన్లో అశోక్ 21 కిలోమీటర్లను 1 గంట 40 నిమిషాల్లో పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 15, 2025
‘ఎస్సీ విద్యార్థులను ఉన్నత విద్యకు ప్రోత్సహించాలి’

షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే దిశగా ప్రోత్సహించాలని జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ అన్నారు. శనివారం కాగజ్నగర్లో సాంఘిక సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలను ఆయన సందర్శించారు. అనంతరం ఎస్సీ విద్యార్థుల సంక్షేమం, వసతి సౌకర్యాలు, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఈడీ సురేష్ కుమార్, ఇతర అధికారులతో సమీక్షించారు.
News November 15, 2025
ASF: ‘10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి’

10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి జిల్లా విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. శనివారం ASF జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో 10వ తరగతి విద్యార్థులకు విద్యా బోధన, విద్యార్థుల హాజరు, మౌలిక వసతుల కల్పన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
News November 15, 2025
ఓటింగ్కి ముందు వీడియోలు వైరల్.. వివాదాల నడుమ విజయం

బిహార్ బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ పిన్టూ సీతామఢీలో విజయం సాధించారు. అయితే ఓటింగ్కు ముందు పిన్టూ ఓ మహిళతో అభ్యంతరకరమైన రీతిలో ఉన్నట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే అవి ఫేక్ అని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023లోనూ ఇదే విధంగా ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారన్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన పిన్టూ, తాజా ఎన్నికల్లో RJD అభ్యర్థి సునీల్ కుమార్ కుశ్వాహాను ఓడించారు. పిన్టూకి 1,04,226 ఓట్లు వచ్చాయి.


