News March 23, 2025
మారుమూల ప్రాంతాలకు తాగునీటిని అందించాలి: ASF కలెక్టర్

మిషన్ భగీరథ పథకం ద్వారా మారుమూల ప్రాంతాలకు శుద్ధమైన తాగునీటిని అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి గ్రామంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ జరుగుతున్న నీటి సరఫరా ప్రక్రియను అదనపు కలెక్టర్ దీపక్ తివారి, మిషన్ భగీరథ ఇంజినీర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శులతో కలిసి పరిశీలించారు. వేసవి కాలంలో ప్రజలకు నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News February 23, 2026
రోజంతా కూర్చుంటున్నారా? ఎక్సర్సైజ్ చేసినా వేస్ట్!

గంటల తరబడి కదలకుండా కూర్చోవడం ప్రాణాంతకమని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. రోజుకు 8గంటల కంటే ఎక్కువ కూర్చుంటే గుండె జబ్బులు, డయాబెటిస్ వచ్చే ముప్పు 20% పెరుగుతుంది. ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేసినా, రోజంతా కూర్చోవడం వల్ల కలిగే నష్టాన్ని అది భర్తీ చేయలేదు. దీనివల్ల బ్లడ్ ఫ్లో మందగించి కొవ్వు పేరుకుపోతుంది. ప్రతి 30నిమిషాలకోసారి సీటు నుంచి లేచి కాసేపు నడవడం లేదా స్ట్రెచింగ్ చేస్తే రిస్క్ తగ్గుతుంది.
News February 23, 2026
నెల్లూరులో ట్రాఫిక్ ASI సస్పెండ్

నెల్లూరు సౌత్ ట్రాఫిక్ ASI వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన బైకులపై కాలేజీకి వెళ్లే విద్యార్థులను ఆపి ఫోన్ పే ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేసుకున్న <<19199048>>వీడియో <<>>వైరల్గా మారింది. దీనిపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో డబ్బులు లేవని వాహనదారులు చెబితే.. ఫోన్ పే చేయమని ఆయన ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వేటు పడింది.
News February 23, 2026
ఏలూరు: ఇంటర్ విద్యార్థులకు SP తీపికబురు

ఇంటర్ విద్యార్థులకు SP ప్రతాప్ శివ కిషోర్ తీపి కబురు చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 30 నిమిషాల ముందు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రానికి వెళ్లడానికి ఆలస్యం అవుతుంటే ఏలూరులోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, ఫైర్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పోలీసు వాహనాలు పరీక్షా కేంద్రానికి తరలించడానికి సిద్ధంగా ఉంటాయన్నారు.


