News March 30, 2025
మారు తల్లి కొట్టడంతో బాలుడి మృతి, మరో బాలుడికి గాయాలు

పల్నాడు జిల్లా ఎడ్లపాడు(మ) కొండవీడు వద్ద గొల్లపాలెంలో కవల పిల్లల్ని మారు తల్లి కొట్టడంతో చనిపోయిన ఘటన చోటుచేసుకుంది. కొండవీడుకి చెందిన కంచర్ల సాగర్, లక్ష్మి అనే మహిళను 2వ వివాహం చేసుకున్నాడు. సాగర్ మొదటి భార్యకి ఇద్దరు కవలలు పుట్టగా, ఆమె అనారోగ్యంతో చనిపోయింది. రెండడో భార్య లక్ష్మి మొదటి భార్య పిల్లలను.. ఓ బాబుని గోడకేసి కొట్టడం వల్ల తల పగిలి అక్కడకక్కడే చనిపోగా, మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
Similar News
News December 2, 2025
సిద్దిపేట: ఈ మండలాల్లో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

సిద్దిపేట జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడు విడత నామినేషన్లు రేపటి నుంచి స్వీకరించనున్నారు. జిల్లాలో 9 మండలాలు అక్కన్నపేట, చేర్యాల, దూల్మిట్ట, హుస్నాబాద్, కోహెడ, కొమురవెల్లి, కొండపాక, కుకునూరుపల్లి, మద్దూరులో మూడో విడత నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. కాగా మొదటి, రెండవ విడత నామినేషన్లు ఇప్పటికే ప్రారంభమై మొదటి విడత నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. రెండో విడత నామినేషన్లు 3న ముగియనున్నాయి.
News December 2, 2025
మెదక్: రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు

మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరించనున్నారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
News December 2, 2025
గద్వాల: కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు: కవిత

విద్యా శాఖ స్వయంగా CM వద్దే ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం సిగ్గుచేటని జాగృతి చీఫ్ కవిత అన్నారు. గద్వాలలోని ST సంక్షేమ హాస్టల్లో కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఆమె ‘X’ వేదికగా స్పందించారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. ఇది ప్రభుత్వ చేతగానితనాన్ని, పేదింటి బిడ్డలంటే లెక్కలేనితనాన్ని బయటపెట్టిందన్నారు.


