News April 1, 2025

మారేడుమిల్లి: తమ్ముడు హత్య కేసులో అన్న అరెస్ట్

image

అల్లూరి జిల్లా మారేడుమిల్లి (M) నీలవరంలో రూ.20 వేలు బాకీ ఇవ్వనందుకు తమ్ముడు సుగ్గిరెడ్డిని బాణంతో హత్య చేసిన అన్న లచ్చిరెడ్డిని అరెస్ట్ చేశామని సీఐ గోపాలకృష్ణ మంగళవారం తెలిపారు. గత నెల 23న ఈ ఘటన జరగగా అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉండగా నేడు అరెస్ట్ చేశామన్నారు. వ్యాన్ కొనుగోలు విషయంలో తమ్ముడు అన్నకు 20 ఏళ్ల క్రితం రూ.20వేలు బాకీ పడ్డాడని, అప్పటి నుంచి ఇరువురు మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపారు.

Similar News

News November 19, 2025

ASF: 18 ఏళ్లు నిండిన మహిళకు చీరలు

image

రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ‘ఇందిరమ్మ మహిళా శక్తి’ పథకం కింద ఏకరూప చీరలు పంపిణీ చేయాలని సీఏం రేవంత్ రెడ్డి సూచించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ఆయన ఈ పథకంపై సమీక్ష నిర్వహించారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఏఎస్‌ఎఫ్ కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో చర్చించి పంపిణీ ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు.

News November 19, 2025

రాష్ట్రంలో 324 ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

image

TG: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న 324 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈవోలకు దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈవోలు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఆలయాల వారీగా రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

News November 19, 2025

హిందూ మహిళలకు సుప్రీంకోర్టు కీలక సూచన

image

మరణానంతరం తన ఆస్తిని ఎవరికి పంచాలో హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. మహిళ చనిపోయాక ఆస్తుల విషయంలో పుట్టింటి, అత్తింటి వారికి వివాదాలు వస్తున్నాయని పేర్కొంది. వారసత్వ చట్టంలోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ ఒక మహిళ పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టం ప్రకారం పిల్లలు లేని వితంతువు చనిపోతే ఆమె ఆస్తులు భర్త ఫ్యామిలీకి చెందుతాయి.