News March 1, 2025

మారేడుమిల్లి: పింఛన్లు పంపిణీలో ప్రథమం

image

అల్లూరి జిల్లాలో సామాజిక భద్రత పింఛన్లు పంపిణీలో మారేడుమిల్లి మండలం 95.61 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచిందని MPDO విశ్వనాధ్ శనివారం తెలిపారు. మండలంలో పలు గ్రామాల్లో పింఛన్లు పంపిణీ కార్యక్రమంను ఆయన పర్యవేక్షించారు.1935 మందికి పింఛన్లు మంజూరు కాగా 1850 మందికి ఇప్పటి వరకు ఇచ్చామన్నారు. గత 5నెలలుగా ఈ మండలమే ప్రథమంగా నిలుస్తుందని తెలిపారు. సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News March 3, 2025

జిల్లాలో మావోయిస్టు కదలికలు లేవు: ములుగు SP

image

ములుగు జిల్లాలో మావోయిస్టుల కదలికలు పూర్తిగా అంతరించిపోయాయని SP శబరిశ్ స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని 25 ఏళ్ల తర్వాత ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారికి అడ్డుగా ఉన్న గేట్లు తెరిచి వాహనాల రాకపోకలకు అనుమతి కల్పించామన్నారు. 2001లో పీపుల్స్ వార్ సభ్యులు ట్రాక్టర్లలో మందుపాతరలు అమర్చి స్టేషన్ పేల్చివేశారని, అయితే ప్రస్తుతం జిల్లాలో వారి కార్యకలాపాలు లేవన్నారు.

News March 3, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 3, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 5.21 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.33 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.23 గంటలకు
ఇష: రాత్రి 7.35 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 3, 2025

గంగవరం: ప్రేమ పేరుతో మోసం.. పోలీసులకు ఫిర్యాదు

image

ప్రేమ పేరుతో యువకుడు మోసం చేశాడని గంగారం మండలం జంగాలపల్లికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. SI రవి కుమార్ వివరాలు.. కొత్తగూడ మండలం వేలుబెల్లికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో ఆమెతో సహజీవనం చేసి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు సదరు మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.

error: Content is protected !!