News March 31, 2025
మార్కాపురంలో క్షుద్ర పూజల కలకలం

మార్కాపురం దసరా మండపం సమీపంలో క్షుద్ర పూజలు ఆదివారం కలకలం రేపాయి. ఉగాది పండుగ రోజు అటుగా వెళ్లిన స్థానికులు పసుపు కుంకుమ, నిమ్మకాయలు కొబ్బెర చిప్పలు వేసి పూజలు చేసినట్లుగా గుర్తించారు. శనివారం అమావాస్య కావడంతో క్షుద్ర పూజలు జరిగాయని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పూజలు జరిగిన ప్రాంతంలో పంప్ హౌస్లో పని చేసేవారు ఈ విషయం తెలిసి ఆందోళన చెందారు. పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు.
Similar News
News April 25, 2025
మార్కాపురం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే సహించేది లేదని మార్కాపూరం పట్టణ ఎస్సై సైదు బాబు హెచ్చరించారు. గురువారం పట్టణ శివారు ప్రాంతంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులను ఆయన గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని హితవు పలికారు. ఏవరైనా ఇలా దోరికితే కఠిన చర్యలు ఉంటాయని కౌన్సిలింగ్ ఇచ్చారు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
News April 24, 2025
ఒంగోలు: నోటిఫికేషన్ విడుదల

ఏపీలో నిన్న టెన్త్ ఫలితాలు వెలువడడంతో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT- AP) పరిధిలోని ఒంగోలు IIITలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ను ఆర్జీయూకేటీ అధికారులు విడుదల చేశారు. ఈనెల 27న ఉ. 10 గంటల నుంచి మే 20వ తేదీ సా. 5 గంటల వరకు దరఖాస్తు గడువు ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News April 24, 2025
రాష్ట్రంలో చివరి స్థానంలో ప్రకాశం జిల్లా

ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా చివరి స్థానంలో నిలిచింది. జిల్లావ్యాప్తంగా ఓపెన్ ఇంటర్లో 3,668 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే.. 547 మంది పాస్ అయినట్లు అధికారులు వెల్లడించారు. 14.9 శాతంతో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా 26వ స్థానంలో నిలిచింది. అలాగే ఓపెన్ టెన్త్లో 1,184 మంది పరీక్షలు రాస్తే.. 88 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 7.4 శాతంతో జిల్లా 21వ స్థానంలో నిలిచింది.