News March 8, 2025
మార్కాపురంలో సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించిన SP

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని CM చంద్రబాబు నేడు మార్కాపురం రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్, SSG ఆఫీసర్స్ కలిసి మార్కాపురంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ తనిఖీలను శుక్రవారం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ వివరించారు.
Similar News
News March 27, 2025
ప్రకాశం జిల్లాలో టెన్షన్.. టెన్షన్

ప్రకాశం జిల్లాలో మరికాసేపట్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ పదవులకు ఉప ఎన్నిక జరగనుంది. వైసీపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ.. ఆ పార్టీకి షాక్ ఇవ్వడానికి కూటమి నాయకులు ప్లాన్ చేశారని సమాచారం. త్రిపురాంతకం వైసీపీ ఎంపీపీ అభ్యర్థి ఆళ్ల ఆంజనేయరెడ్డి జైల్లో ఉన్నారు. మరి అక్కడ ఆయన గెలుస్తారా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది. నిన్న రాత్రి నుంచే పోలీసులు అప్రమత్తంగా ఉంటూ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
News March 27, 2025
మార్కాపురం: ఇద్దరు యువకుల మృతి

పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. అర్ధవీడు(M) నారాయణపల్లికి చెందిన ఆర్మీ జవాన్ ఇంద్రసేనారెడ్డి(27), మార్కాపురం(M) మిట్టమీదపల్లికి చెందిన కాశిరెడ్డి(29) నాగార్జునసాగర్లోని బంధువుల ఇంటికి బైకుపై వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా మాచర్ల(M) కొత్తపల్లి జంక్షన్ వద్ద డీసీఎం వీరిని ఢీకొట్టింది. ఇంద్రసేనారెడ్డి అక్కడికక్కడే చనిపోగా.. కాశిరెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.
News March 27, 2025
ప్రకాశం: ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు

ప్రకాశం జిల్లాలో MPP, వైస్ MPP, కో ఆప్షన్ నెంబర్, ఉపసర్పంచ్ స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తే, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. ఎస్పీ ఒంగోలులో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఆ ప్రాంతాలలో 30 యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. నిరంతరం సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశామన్నారు.