News December 20, 2024
మార్కాపురం: కులం పేరుతో దూషణ.. కేసు నమోదు

మార్కాపురం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి కె. శ్రీనివాసులును దూషించిన కేసులో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కార్యాలయం లోపలికి వచ్చి విధులకు ఆటంకం కలిగించి, దౌర్జన్యానికి దిగి కులం పేరుతో దూషించినట్లు శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మార్కాపురానికి చెందిన గాలి వెంకటరామిరెడ్డి, పెరుమాళ్ళ సుబ్రహ్మణ్యం (బుల్లి) అనే ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు.
Similar News
News November 20, 2025
ప్రకాశం: నూతన అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు రెండేళ్ల కాలపరిమితికి జారీ చేసే నూతన అక్రిడిటేషన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు గురువారం ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులను http://mediarelations.ap.gov.in వెబ్ సైట్లో సమర్పించాలన్నారు. అర్హత కలిగిన పాత్రికేయులు పూర్తి వివరాలను వెబ్సైట్లో ఈ నెల 21 నుంచి నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
News November 20, 2025
ప్రకాశం: నూతన అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు రెండేళ్ల కాలపరిమితికి జారీ చేసే నూతన అక్రిడిటేషన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు గురువారం ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులను http://mediarelations.ap.gov.in వెబ్ సైట్లో సమర్పించాలన్నారు. అర్హత కలిగిన పాత్రికేయులు పూర్తి వివరాలను వెబ్సైట్లో ఈ నెల 21 నుంచి నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
News November 20, 2025
సాగర్ కవచ్కు 112 మంది పోలీసుల కేటాయింపు

జిల్లాలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సాగర్ కవచ్ను రెండు రోజులపాటు పోలీసులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా సముద్ర తీర ప్రాంతంలో మొత్తం 112 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని బందోబస్తు విధులలో కేటాయించారు. సముద్ర మార్గం ద్వారా చొరబాట్లను అడ్డుకోవడం, అనుమానాస్పద వస్తువులను గుర్తించడం వంటి అంశాలపై ప్రత్యేక పోలీస్ బృందాలను సైతం నియమించారు.


