News April 12, 2025
మార్కాపురం తహశీల్దార్కి ప్రమాదం

ప్రకాశం జిల్లా మార్కాపురం తహశీల్దారు చిరంజీవికి పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం స్వయంగా తానే కారు నడుపుతూ మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్తుండగా.. పొదిలి సమీపంలో ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో తహశీల్దార్ చిరంజీవికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా ఈ ప్రమాదంలో కారు ధ్వంసం అయింది.
Similar News
News February 23, 2026
ఒంగోలు: ‘మీకోసం’కు 75 ఫిర్యాదులు

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా సోమవారం ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు ప్రత్యక్షంగా వివరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో అధికారులు ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. మీకోసం కార్యక్రమానికి 75 ఫిర్యాదులు అందాయని త్వరగా పరిష్కరించాలన్నారు.
News February 23, 2026
వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు అంతా ప్రాముఖ్యత

రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు తర్వాత తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టుల్లో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కూడా ఒక్కటి. ఈ ప్రాజెక్టు కోసం కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఫిడర్ కెనాల్ మరమ్మత్తులకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 25న రూ.456కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల్లోని పలు మండలాలు సస్యశ్యామలం అవుతాయి.
News February 23, 2026
ప్రకాశం: క్రికెట్ బెట్టింగ్.. SI పేరుతో బెదిరింపులు

ప్రకాశం(D) జరుగుమల్లి(M) చింతలపాలెంకి చెందిన శ్రీనివాసరావు, అల్లుడు హేమంత్ క్రికెట్ బుకీ నడుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తనను బెట్టింగులకు అలవాటు చేసి, తనవద్ద చెక్కులు తీసుకొని నగదు అప్పు ఇచ్చి బెట్టింగులు పెట్టించారని సోమవారం జిల్లా గ్రీవెన్స్లో ఓ బాధితుడు వాపోయాడు. నగదుకోసం హేమంత్ సోదరుడు ఒంగోలుని ఓ రైల్వే SI పేరుచెప్పి బెదిరిస్తున్నారని, న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయాడు.


