News July 27, 2024

మార్కాపురం: PIC OF THE DAY

image

మార్కాపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివారం తల్లిదండ్రుల దినోత్సవాన్ని ముందస్తుగా నిర్వహించారు. దీనికి జోన్ ZEO శ్రీకృష్ణ గణేష్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ నాగరాజు నిర్వహించారు. తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం తల్లిదండ్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలు తల్లిదండ్రుల విలువ తెలుసుకోవాలని గణేశ్ తెలిపారు. పిల్లలకు ల్లిదండ్రులతో ఆశీర్వాదం ఇప్పించారు.

Similar News

News July 8, 2025

ఒంగోలు: ‘త్వరగా ఫిర్యాదులు పరిష్కరించాలి’

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 79 ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ దామోదర్ పాల్గొని ఫిర్యాదుదారుల సమస్యలను, ఫిర్యాదులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి ఫిర్యాదులను పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.

News July 7, 2025

ప్రకాశం: కార్లు అప్పగించలేదంటూ SPకి ఫిర్యాదు.!

image

మూడు కార్లను బాడుగకు తీసుకొని 7 నెలలుగా బాడుగ డబ్బులు చెల్లించడం లేదని ఓ వ్యక్తి సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఒంగోలు మారుతి నగర్‌కు చెందిన ఓ వ్యక్తి మూడు కార్లను బాడుగకు మరో వ్యక్తికి అప్పగించాడు. 7 నెలలు పూర్తైనా ఇప్పటివరకు బాడుగ చెల్లించలేదు. అంతేకాకుండా కార్లను అప్పగించకపోవడంతో బాధితుడు, జిల్లా ఎస్పీ దామోదర్‌ను ఆశ్రయించారు. విచారణ చేయాలని ఎస్పీ ఆదేశించారు.

News July 7, 2025

ప్రకాశం: 10 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ASIలుగా పదోన్నతి

image

ప్రకాశం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న 10 మందికి ఏఎస్ఐలుగా పదోన్నతి వచ్చింది. వీరిని ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ మేరకు వారి పదోన్నతికి సంబంధించిన పత్రాలను అందించి ఎస్పీ పలు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన ప్రతి ఒక్కరు విధి నిర్వహణలో పేరు ప్రఖ్యాతలు సాధించాలన్నారు.