News April 14, 2025
మార్కుల ఆనందం ఆవిరైంది!

కదిరిలో ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్న శారద (40) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆమె కుమార్తె కీర్తి విజయవాడలో ఇంటర్ చదువుతుండగా 973 మార్కులు వచ్చాయి. దీంతో విజయవాడ నుంచి కుమార్తెను తీసుకుని అరుణాచలం వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి కారులో వస్తుండగా పుంగనూరు మండలం సుగాలిమిట్టలో లారీ ఢీకొని చనిపోయారు. ఈ ఘటనలో భర్త, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని బెంగళూరుకు తరలించారు.
Similar News
News October 21, 2025
Asia cup ట్రోఫీ వివాదం.. ఏసీసీ కొత్త ప్రతిపాదన!

Asia cup ట్రోఫీని తమకు అందజేయాలని ACC చీఫ్ నఖ్వీకి <<18064371>>బీసీసీఐ మెయిల్<<>> పంపిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ తొలివారంలో ట్రోఫీ ప్రజెంటేషన్ కార్యక్రమం దుబాయ్లో నిర్వహిస్తామని ACC ప్రతిపాదన చేసింది. ‘మీరు ట్రోఫీని కోరుకుంటే.. దాన్ని ఇచ్చేందుకు వేదిక ఏర్పాటు చేస్తాం’ అని చెప్పినట్లు సమాచారం. కానీ అందుకు BCCI సుముఖంగా లేదని, ICC మీటింగ్లో దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని ACC వర్గాలు చెప్పాయి.
News October 21, 2025
ప.గో: జిల్లాస్థాయి ఎంపికలో 102 మంది ఎంపిక

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఏలూరులో 2చోట్ల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14,17 జిల్లా స్థాయి ఎంపిక పోటీలను మంగళవారం నిర్వహించామని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి అలివేలుమంగ తెలిపారు. జూడో క్రీడలకు 72 మంది హాజరు కాగా 30 మంది, స్కేటింగ్ 122 కి 62 మంది, సాఫ్ట్ టెన్నిస్ 30 కి 5 గురు, స్క్వాష్ క్రీడలకు 30 కి 5 గురు ఎంపికయ్యారన్నారు.16 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News October 21, 2025
ANU: ఎల్ఎల్బీ రెగ్యులర్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జులై 2025లో నిర్వహించిన ఎల్ఎల్బీ రెగ్యులర్ ఫలితాలను మంగళవారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. ఎల్ఎల్బీ 3-4, 5-8 సెమిస్టర్లలో 84.05%, ఎల్ఎల్బీ 5-4 సెమిస్టర్లో 63.02% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఏప్రిల్ 2025లో జరిగిన ఎల్ఎల్బీ 3-1, 5-5 రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను కూడా విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.