News March 10, 2025
మార్చిలో అందని సన్న రేషన్ బియ్యం

మార్చి నెల నుంచి పేదలకు సన్న బియ్యం అందిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ, రేషన్ దుకాణాల్లో సరఫరా సమస్యల కారణంగా పేదలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అవసరం 1.51 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇప్పటివరకు సరఫరా అయినది కేవలం 62,346 మెట్రిక్ టన్నులు మాత్రమే. దీంతో, ఈసారి దొడ్డు బియ్యం ఇస్తున్నారు.
Similar News
News November 12, 2025
జూబ్లీ బైపోల్.. ఫలితాలపై ఎవరి ధీమా వారిదే!

రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం ముగిసింది. 48.49 శాతం పోలింగ్ నమోదు కాగా ఫలితాల్లో తమదే విజయమంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు చెబుతున్నారు. పోల్ మేనేజ్మెంట్ పక్కాగా జరిగిందని, తామే గెలుస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఇక ఎన్ని ప్రలోభాలు ఎదురైనా సైలెంట్ ఓటింగ్తో తమదే గెలుపు అని BRS ధీమాగా ఉంది. ఇక ఎగ్జిట్ పోల్స్ అనంతరం కమలనాథులు సందిగ్ధంలో ఉన్నారు. గెలుపెవరిదో..?
News November 12, 2025
WOW.. HYDలో ఇప్పపువ్వు లడ్డూలు

HYDలో నాంపల్లి, శేర్లింగంపల్లి లాంటి పలు ప్రాంతాల్లో ఇప్ప పువ్వు లడ్డూలు కనపడుతున్నాయి. ఆదిలాబాద్ ఉట్నూర్ ప్రాంతానికి చెందిన ఆదివాసీ మహిళలు స్థానిక వ్యాపార రంగంలో కొత్త ఉరవడికి నాంది పలికారు. ఎన్నో పోషకాలున్న ఈ లడ్డూ రక్తహీనత తగ్గించే, వ్యాధి నిరోధకశక్తినిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు HYDలో భీమాబాయి మహిళా సహకార సంఘం ఈ ఉత్పత్తుల ద్వారా ఏడాదికి రూ.1.27 కోట్ల ఆదాయం పొందుతోంది.
News November 12, 2025
HYD: ఈ టైమ్లో 70% యాక్సిడెంట్స్.. జాగ్రత్త..!

HYDలో జరుగుతున్న ప్రమాదాలను పరిశీలిస్తే అత్యధికంగా రాత్రి ఒంటిగంట నుంచి ఉ.10 గంటల మధ్యలో సుమారు 70% ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అతివేగం, మద్యం మత్తులో వాహనంపై పట్టుకోల్పోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నట్లు దర్యాప్తులో తేలింది. మద్యం తాగి వాహనం నడపొద్దని, ఓవర్ స్పీడ్ వద్దని పోలీసులు సూచిస్తున్నారు.


