News August 4, 2024
మార్చి నాటికి దేశవ్యాప్తంగా BSNL 4G సేవలు : పెమ్మసాని

దేశవ్యాప్తంగా వీలైనంత వేగంగా BSNL 4G సేవలు విస్తరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం తాడికొండలో 4G టవర్ను స్థానిక MLA శ్రవణ్ కుమార్తో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బేస్ బ్యాండ్ యూనిట్ను ఆయన ప్రారంభించారు. పెమ్మసాని మాట్లాడుతూ.. సెప్టెంబర్ కల్లా 70%, మార్చి లోపు 100% 4G సేవలను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నామన్నారు.
Similar News
News October 23, 2025
GNT: స్కూల్స్కు సెలవుపై పేరెంట్స్ విమర్శలు

భారీ వర్షాల కారణంగా గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయంపై తల్లిదండ్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉదయం 9 గంటల తర్వాత సెలవు ప్రకటించడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అప్పటికే పిల్లలు వర్షంలో తడుస్తూ పాఠశాలలకు వెళ్లిపోయారని, ఉదయం నుంచే వర్షం పడుతున్నందున ముందుగానే స్పందించి ఉండాల్సిందన్నారు. రేపటి సెలవు సమాచారమైనా ముందుగానే స్పష్టంగా ఇవ్వాలన్నారు.
News October 23, 2025
GNT: భారీ వర్షాలకు అప్రమత్తమైన అధికార యంత్రాంగం

తీవ్ర అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గుంటూరు కలెక్టరేట్లో కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం ఉదయం నుంచి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆకస్మిక వరదల పట్ల ప్రజలను అప్రమత్తంగా చేయాలని, చెట్లు, భారీ హోర్డింగ్లు, శిథిల భవనాల వద్ద ఉంచవద్దని సూచించారు. అత్యవసరమైతే గుంటూరు కలెక్టరేట్ నెంబర్ 08632234990కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
News October 23, 2025
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులపై గురువారం అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. గండి పడే అవకాశం ఉన్న వాగులు, వంకలు, చెరువులను నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవసరం మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పంటలు రక్షించుకునే విధంగా రైతులకు తగు సూచనలు జారీ చేయాలన్నారు.