News July 21, 2024
మార్చి నాటికి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి: కోమటిరెడ్డి

వచ్చే మార్చినాటికి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నార్కట్పల్లిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 16 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న SLBC సొరంగం పనుల పూర్తికి రాష్ట్ర సీఎంతో మాట్లాడి రూ.2200 కోట్లు మంజూరు చేయించడమే కాకుండా, నిధుల విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ లో నిధులు ఏర్పాటు చేశామని తెలిపారు.
Similar News
News November 16, 2025
NLG: పత్తి కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష

పత్తి కొనుగోళ్లు, రైతుల సమస్యలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం రాత్రి జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమీక్షించారు. రైతుల సంక్షేమం దృష్ట్యా సోమవారం తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మిల్లుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతులు ఇప్పుడు 12 క్వింటాళ్ల వరకు పత్తిని అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.
News November 16, 2025
లోక్ అదాలత్లో 6,362 కేసుల పరిష్కారం: ఎస్పీ

జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా జిల్లాలో రికార్డు స్థాయిలో పెండింగ్ కేసులను పరిష్కరించినట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవా షెడ్యూల్ ప్రకారం నిర్వహించిన ఈ లోక్ అదాలత్లో మొత్తం 6,362 కేసులను రాజీ మార్గంలో పరిష్కరించామని ఆయన వెల్లడించారు. రాజీ మార్గమే రాజమార్గమని ఎస్పీ పేర్కొన్నారు.
News November 16, 2025
మిర్యాలగూడకు మంత్రులు..ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా

మిర్యాలగూడలో సోమవారం జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి విచ్చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శెట్టిపాలెం నుంచి అవంతిపురం వరకు నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన వంటి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొంటారు.


