News February 25, 2025
మార్చి 1న HYD, రంగారెడ్డిలో రేషన్ కార్డుల పంపిణీ

కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మొదటిగా ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్, HYD ప్రజలకు మార్చి1న అందించనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. రంగారెడ్డిలో 24వేల కొత్త రేషన్ కార్డులు, వికారాబాద్లో 22 వేలు, మేడ్చల్లో 6వేలు, HYD 285 రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, దీనికి చివరి గడువంటూ ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు.
Similar News
News February 25, 2025
సంగారెడ్డి: ప్రజా పోరాటాల వేదిక జిల్లా కన్వీనర్గా రాజయ్య

ప్రజా పోరాటాల వేదిక జిల్లా కన్వీనర్గా రాజయ్యను సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో నిర్వహించిన సమావేశంలో మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజయ్య మాట్లాడుతూ.. తనను జిల్లా కన్వీనర్గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తారని పేర్కొన్నారు. జిల్లా కన్వీనర్గా నియామకమైన రాజయ్యను సన్మానించారు.
News February 25, 2025
నల్గొండ జిల్లా టాప్ న్యూస్

⏭ దామరచర్లలో దొంగ నోట్ల కలకలం ⏭ పీఏ పల్లిలో మహిళా దారుణ హత్య ⏭ వైద్య సిబ్బందిని బెదిరిస్తే కేసులు: ఎస్పీ శరత్ చంద్ర పవర్ ⏭ రిజిస్టర్ ఓటర్లకు సెలవు: కలెక్టర్ ఇలా త్రిపాఠి ⏭ ఎయిడ్స్పై అవగాహన కలిగి ఉండాలి: డాక్టర్ సుచరిత ⏭ శివరాత్రికి ముస్తాబవుతున్న శివాలయాలు ⏭ గుర్రంపోడు ఎమ్మార్వోని సస్పెండ్ చేసిన కలెక్టర్
News February 25, 2025
రెడ్డిలపై చేసిన వ్యాఖ్యలను తప్పుగా తీసుకోవద్దు: జగ్గారెడ్డి

ఇటీవల కాంగ్రెస్ పార్టీలోని కొందరు రెడ్డి సామాజిక వర్గంపై చేసిన విమర్శల్ని తప్పుగా తీసుకోవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇటీవల పార్టీలోకి వచ్చిన కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. వాళ్ల మాటలు పట్టించుకోని పార్టీ పట్ల వ్యతిరేక భావన కలిగి ఉండవద్దన్నారు. రెడ్డి సామాజిక వర్గం ప్రస్తుతం రాష్ట్రంలో నాయకత్వం స్థానంలో ఉందని అందరూ ఓపిగ్గా ఉండాలని కోరారు.