News September 28, 2024

మార్చి 2025 నాటికి గృహాలు మొత్తం పూర్తి చేయాలి: కలెక్టర్

image

ప్రజలకు గృహాలు కల్పించడం అనేది ప్రభుత్వానికి ప్రాధాన్యత కలిగిన అంశమని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. శనివారం బాపట్ల మూలపాలెం రహదారిలోని లే అవుట్‌లో గృహ నిర్మాణా లబ్ధిదారులతో మన ఇల్లు-మన గౌరవం అనే కార్యక్రమం ద్వారా ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. మార్చి 2025 నాటికి పెండింగ్‌లో ఉన్న గృహాలు మొత్తం పూర్తి చేయాలని సూచించారు. గృహాల పురోగతి కోసం ప్రత్యేకంగా సచివాలయాల సిబ్బందిని నియమిస్తామన్నారు.

Similar News

News December 5, 2025

GNT: జాతీయ రహదారిపై ప్రమాదం.. విద్యార్థిని స్పాట్ డెడ్

image

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో SRM యూనివర్సిటీ విద్యార్థిని అక్కడికక్కడే మరణించింది. మృతురాలు SRMలో BBA చదువుతున్న మచిలీపట్నానికి చెందిన సుమయ్య (18)గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News December 5, 2025

కేఎల్‌యూలో నేడు ‘ఉద్భవ్-2025’ ముగింపు సంబరాలు

image

వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో జరుగుతున్న 6వ జాతీయ ఏకలవ్య సాంస్కృతిక ఉత్సవాలు ‘ఉద్భవ్-2025’ నేటితో ముగియనున్నాయి. గిరిజన సంక్షేమ గురుకులాల ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు ముగింపు వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేశ్, డోలా బాలవీరాంజనేయస్వామి, గుమ్మడి సంధ్యారాణి అతిథులుగా హాజరవుతారు. గిరిజన విద్యార్థుల కళా ప్రదర్శనల అనంతరం, చేతులకు బహుమతులు అందించనున్నారు.

News December 5, 2025

GNT: సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఆదేశాలు

image

సీజనల్ వ్యాధుల నియంత్రణపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. ధాన్యం కొనుగోలు, ఎరువుల లభ్యత, సీజనల్ వ్యాధుల నియంత్రణ ఇతర ప్రాధాన్య ఆరోగ్య అంశాలపై గురువారం సచివాలయం నుంచి విజయానంద్ అన్నీ జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఎరువుల కొరత లేకుండా చూడాలని చెప్పారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం నుంచి కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈ వీసీలో పాల్గొన్నారు.