News February 25, 2025

మార్చి 29తో ముగియనున్న ఎమ్మెల్సీ పదవీ కాలం

image

టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగిన రామారావు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2019లో ఎమ్మెల్యే కోటాలో దువ్వారపు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఈ స్థానం ఖాళీ కానుంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. ఈయన స్థానంలో పార్టీ ఎవరి పేరును ఖరారు చేస్తుందో వేచి చూడాలి.

Similar News

News November 17, 2025

బంగ్లా చెరలో ఉన్న మత్స్యకారులు.. దీనగాథ

image

భోగాపురం మండలం కొండరాజుపాలెం సర్పంచ్ సూరాడ చిన్నా ఆధ్వర్యంలో మత్స్యకారులు విశాఖ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సముద్రంలో వేటకు వెళ్లగా బంగ్లాదేశ్ బోర్డర్‌లో ప్రవేశించడంతో 9 మందిని గతనెల 22న బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అరెస్టు చేసింది. అరెస్టు కాబడిన వారిలో సూరాడ అప్పలకొండ భార్య ఎనిమిది నెలల నిండు గర్భిణీగా ఉందని వెంటనే విడిపించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌కు మత్స్యకారులు కోరారు.

News November 17, 2025

బంగ్లా చెరలో ఉన్న మత్స్యకారులు.. దీనగాథ

image

భోగాపురం మండలం కొండరాజుపాలెం సర్పంచ్ సూరాడ చిన్నా ఆధ్వర్యంలో మత్స్యకారులు విశాఖ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సముద్రంలో వేటకు వెళ్లగా బంగ్లాదేశ్ బోర్డర్‌లో ప్రవేశించడంతో 9 మందిని గతనెల 22న బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అరెస్టు చేసింది. అరెస్టు కాబడిన వారిలో సూరాడ అప్పలకొండ భార్య ఎనిమిది నెలల నిండు గర్భిణీగా ఉందని వెంటనే విడిపించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌కు మత్స్యకారులు కోరారు.

News November 16, 2025

వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు: ప్రణవ్

image

సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కావటంతో వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. ఫ్యూచర్ రెడీ ఇన్నోవేషన్ రాష్ట్రంగా ఏపీని సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. పెద్దఎత్తున ఒప్పందాలు జరగటంతో వైసీపీ నేతలు భయపడి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కోడిగుడ్డు మంత్రిగా పేరొందిన అమర్ నాథ్ ఉన్న ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు.